మద్యం దుకాణాలకు దరఖాస్తుల అంకం ముగిసింది. దరఖాస్తుల ఆదాయం, సంఖ్య భారీగానే పెరిగినప్పటికీ కార్పొరేషన్ల పరిధిలో ఇంకా 105 దుకాణాలకు ఒక్క ఆర్జీ కూడా దాఖలు కాకపోవడం విశేషం. సుమారు నాలుగు నెలలపాటు భారీ కసరత్తు చేసి రూపొందించిన నూతన మద్యం పాలసీలో కూడా దరఖాస్తులకు నోచని దుకాణాలు నమోదు కావడం విశేషం. ఈనెల 14నుంచి ప్రారంభమైన దరఖాస్తుల గడువు నిన్నటితో ముగిసింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 2216 దుకాణాలకుగానూ 2111 మద్యం దుకాణాలకు వ్యాపారస్తులనుంచి స్పందన వచ్చింది.
వీటికిగానూ 30,987 దరఖాస్తులు దాఖలు కావడంద్వారా 154.94 కోట్ల దరఖాస్తు ఆదాయం సమకూరింది. గతేడాదికంటే దరఖాస్తులు 30 శాతం వృద్ధి చెంది 30వేలకు చేరాయి. గతేడాది 21,756 దరఖాస్తులు రాగా ఈ ఏడాది 30,987 దరఖాస్తులు రావండతో ఆబ్కారీ శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది. గతేడాది దరఖాస్త్త్ు రుసుముల రూపంలో ఏడాదికి 53.56 కోట్ల రాబడి ఖజానాకు చేరగా తాజాగా రెండేళ్ల పాలసీలో ఇది 200 శాతం వృద్ధిరేటుతో 154.94 కోట్లకు చేరింది. మిగిలిపోయిన మద్యం దుకాణాలకు బుధవారం నిర్వహించనున్న లాటరీల తర్వాత రీ నోటిఫిికేషన్ ద్వారా దరఖాస్త్ులను ఆహ్వానించనున్నారు. ఇందుకుగానూ రీ లొకేషన్కు అనుమతించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించింది. ఫలితంగా డిమాండ్ ఉన్న ప్రాంతాలకు షాపుల అనుమతింపుతో దరఖాస్తులు వస్తాnయని అంచనా వేస్తున్నారు.
ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 105 దుకాణాలకు ఒక్క దరఖాస్త్తు కూడా రాలేదు. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 52 ఉన్నాయి. వీటిలో హైదరాబాద్లో 19, సికింద్రాబాద్లో 25, దూల్పేట్లో 8, రంగారెడ్డిలో 32 ఉండా వీటిలో సరూర్నగర్లో 27, మేడ్చేల్లో 5 దుకాణాలు ఉన్నాయి. వరంగల్లో 5, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల్లో 2, నిజామాబాద్లో 5, మెదక్ జిల్లా సంగారెడ్డిలో 5 దుకాణాలకు దరఖాస్తులు రాలేదు. మెదక్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లఓ కొన్ని ప్రాంతాలె కార్పొరేషన్లు, పురపాలక సంఘాల పరిధిలోకి చేరడంతో దరఖాస్తులు రాలేదు. పెరిగిన లైసెన్సు రుసుములు ఇందుకు ఆటంకంగా మారాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more