తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి నిన్నటి పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ నేతలకు తగిన సూచనలు, సలహాలు అందించారు. సమావేశాల్లో అవలంబించాల్సిన ధోరణి, ప్రతిపక్షాలకు ధీటుగా ఎదురుకునేందుకు తగిన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల మీద విపక్షాలు అధికార పక్షాన్ని నిలదీసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి వివరాలతో సభలో ముప్పేద ఎదురుదాడికి సిద్దంగా ఉండాలని కేసీఆర్ సూచించారట. గణాంకాలతో వివరించి సహా సభలో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చెయ్యాలని అన్ని శాఖల మంత్రులకు కేసీఆర్ హుకుం జారీ చేశారు. తాజాగా చైనా పర్యటనతో సహా అన్నింటి మీద సభలో వివరించాలని.. ప్రతిపక్షాలు సహేతుక చర్చకు అవకాశం ఇస్తే ఎంతవరకైనా కానీ సభను కొనసాగిస్తామని కేసీఆర్ వెల్లడించారు.
మరో పక్క ప్రతిపక్షాలు అధికార పక్షం మీద అన్ని రకాలుగా దాడికి సిద్దంగా ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు, ప్రాజెక్టులు, ఉద్యోగాల ప్రకటన, కాంటాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తో సహా పలు కీలక అంశాల మీద అధికార పక్షానికి చెమటలు పట్టించాలని సిద్దమవుతున్నాయి. కాగా గతంలో అసెంబ్లీ సమావేశాల్లో మాదిరిగానే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే సభ్యలను సభలోనుండి వెళ్లగొట్టేందుకు అన్ని రకాల ఏర్సాట్లు చేసుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి లాంటి టిడిపి నాయకులు సభలో గందరగోళ పరిస్థితిని నెలకొల్పితే సభలో ఎలాంటి చర్యలకైనా స్పీకర్ , అటు ప్రభు్తంవ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా నేటి నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సామావేశాలు ప్రజా సమస్యలను ఎంత వరకు చర్చకు తీసుకువస్తాయో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more