కృష్ణానది పరివాహకంగా ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి నీటిప్రవాహం నిలకడగా కొనసాగుతూ వస్తోంది. శుక్రవారం జలాశయం లోకి ఇన్ఫ్లో 40,822 క్యూసెక్కులు ఉండగా, నీటిమట్టం 838.80 అడుగులకు చేరుకుంది. నీటినిలువ 60 టీఎంసీలకు పెరిగినట్టు జలవన రుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షా కాలం ప్రారంభం నుంచి ఇప్పటివరకూ జలా శయంలోకి ఎగువ నుంచి 36టీఎంసీల నీరు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా కనిష్ట నీటిమట్టం 854అడుగులుగా ఉంది. నీటిమట్టం కనిష్ట స్థాయికి చేరుకోవాలంటే మరో 16అడుగులు పెరగాల్సి వుంది. జలాశయంలో నీటిమట్టం ఈ స్థాయికి చేరితేనే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం కుడిప్రధాన కాలువకు నీటివిడుదల సాధ్యపడుతుంది.
రాయలసీమ ప్రాంతం ప్రజల నుంచి ఇప్పటికే శ్రీశైలం నీటికోసం డిమాండ్లు అధికమవుతున్నాయి. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854అడుగుల స్థాయికి చేరుకునేదాక ప్రాజెక్టు నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ నీటిని దిగువకు విడుదల చేయరాదని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న గ్రామాల తాగునీటి అవసరాలకోసం శ్రీశైలం నుంచి నాలుగు రోజులుగా నీటివిడుదల జరుగుతోంది. శుక్రవారం కూడా జలాశయం నుంచి 5055 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. కృష్ణానది పరివాహకంగా ఎగువన కర్నాటకలో ప్రాజెక్టుల్లోకి నీటిచేరికలు తగ్గుతున్నాయి. ఆల్మట్టి జలాశయంలోకి 10209 క్యూసెక్కుల నీరు మాత్రమే ఎగువ నుంచి చేరుతోంది. దిగువన నారాయణపూర్ జలాశయంలోకి కూడా ఇన్ఫ్లో 5600క్యూసెక్కులు మించటం లేదు. జూరాల వద్ద ఇన్ఫ్లో 14,717క్యూసెక్కులు ఉండగా విద్యుత్ ఉత్పత్తి అనంతరం పవర్హౌస్ ద్వారా 13,816 క్యూసెక్కుల నీరు నదిలోకి విడుదల చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. కృష్ణాకు ప్రధాన ఉపనదిగా ఉన్న తుంగభద్రలో కూడా పరిస్థితులు అంత ఆశాజనకంగా కనిపించటం లేదు. ఎగువ నుంచి జలాశయంలోకి కేవలం 2872 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుకుంటోంది. రోజా వద్ద నదిలో నీటిప్రవాహం 30,800 క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more