ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ, దాని మిత్ర పక్షాలు చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. దాని మీద గంపగుత్తగా నిషేధం విధించడం కుదరదని ఈసీ స్పష్టం చేసింది. ఆలిండియా రేడియోను ప్రధానమంత్రి తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ఆరోపించారు. ఇప్పుడు బిహార్ ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరారు. కాగా దీనిని కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ద్వందంగా తోసిపుచ్చింది.
అయితే, మన్ కీ బాత్ కార్యక్రమం నిజంగానే ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నట్లుగా నిరూపితం అయితే మాత్రమే ఇలాంటి డిమాండును తాము పరిశీలనలోకి తీసుకోగలమని స్పష్టం చేసింది. ఈలోపు గంపగుత్తగా నిషేధం విధించడం సాధ్యం కాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కేబినెట్ సమావేశాలు, మన్కీ బాత్ లాంటి కార్యక్రమాలపై నిషేధం కుదరదని ఈసీలోని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీహార్ ఎన్నికల నేపథ్యంలో నిషేదించాలని కాంగ్రెస్ సహా ఆ పార్టీ మిత్రపక్షాలు ఇవాళ ఉదయం ఈసీని కోరాయి.
ఈ మేరకు ఆ పార్టీల సీనియర్ నాయకులు న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) నసీం జైదీని ఆయన కార్యాలయంలో కలిశారు. బీహార్ ఎన్నికలు పూర్తయ్యే వరకు మన్ కీ బాత్ కార్యక్రమం నిలిపి వేయాలని వారు ఈ సందర్భంగా సీఈసీని కోరారు. అయితే కాంగ్రెస్ చేసిన విన్నపాన్ని సీఈసీ సున్నీతంగా తిరస్కరించినట్లు సమాచారం. కాగా బీహార్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 శాసన సభ స్థానాలకు ఐదు దశలలో జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలు అక్టోబర్ 12 న మొదలై.... తుది ఎన్నికలు నవంబర్ 5 తేదీతో ముగుస్తాయి. ఎన్నికల ఫలితాలు నవంబర్ 8వ తేదీన ప్రకటిస్తారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more