ఢిల్లీ యూనివర్సిటీకి అధికార విద్యార్థి సంఘం గుర్తింపు కోసం జరుగుతున్న ఎన్నికలలో రాజకీయపార్టీలు అన్నిహద్దులూ మీరి ఖర్చు పెడుతున్నాయని అందరికీ తెలిసినా.. వాటిపై ధైర్యం చేసి ప్రశ్నించే గళం మాత్రం విద్యార్థులకు లేకపోయింది. ఈ రాజకీయ పార్టీల ఖర్చులను చూసి అవి రాజేసే పరిణామాల గురించి ఆలోచించిన ఓ యువతి ఇక చాలు అని నినదిస్తుంది. ఇన్నాళ్లు వేరు..ఇప్పడు వేరు... అంటూ గొంతెత్తి పలికింది. రాజకీయ పార్టీల ఖర్చులకు, ప్రచార హోరుకు కళ్లెం వేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది 20 ఏళ్ల విద్యార్థిని రూబీ మాలిక్. నాలుగేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో రాజకీయపార్టీలు ఎంపీ ఎన్నికల మాదిరిగా డబ్బు వెదజల్లడాన్ని తాను వ్యక్తిగతంగా అడ్డుకోలేకపోయినా.. కనీసం తాను చదువుకుంుటన్న న్యాయశాస్త్ర ప్రకారం న్యాయస్థానం ద్వారా ప్రయత్నించాలని పూనుకున్నారు. ఏకంగా కోర్టు ద్వారాలు తట్టారు.
తొలిసారిగా ఆమ్ ఆద్మీపార్టీ యువ విభాగం - ఛాత్ర యువ సంఘర్ష సమితి పేరుతో ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఏబీవీపీ, నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా తో పోటీ పడుతోంది. ఢిల్లీ వర్సిటీ కేంపస్ లో కేజ్రీవాల్ భారీ కటౌట్ చూస్తే..వాళ్లు ఎంత ఖర్చుపెడుతున్నారో తెలుస్తోందని ఆమె అన్నారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన దానిని కాదని ఆమె పేర్కొన్నారు. స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో గైడ్ లైన్స్ అంతా అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం కాలేజీ ఎన్నికల్లో ఓ అభ్యర్థి రూ. 5 వేలకన్నా ఎక్కువ ఖర్చు చేయరాదు. వాహనాల ర్యాలీలు, పోస్టర్ల దందా నిషేధం. అయితే ఎవరైనా యూనివర్సిటీని సందర్శిస్తే.. సుప్రీం కోర్టు మార్గదర్శిక సూత్రాలను పట్టించుకోవడం లేదని , లక్షలు ఖర్చు చేస్తున్నారని రూబీమాలిక్ ఆరోపించారు. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులను ప్రశ్నిస్తే.. కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఎన్ ఎస్ యూఐ, ఏబీవీపీతో సహా అన్ని పార్టీలూ కోట్లు గుమ్మరిస్తున్నాయని పేర్కొన్నారు. కోర్టు జోక్యంతో పరిస్థితి చక్కబడుతుందని ఆశిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more