ఉత్తరప్రదేశ్ రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులకు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది అక్కడి అలహాబాద్ హైకోర్టు. వారంతా తమ పిల్లల్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకే పంపాలని ఆదేశించింది. ఎన్ని దశాబ్దాలు గడుస్తున్నా... సర్కారీ బడులు... బాగుపడట్లేదన్న ఆగ్రహంతో ఇలాంటి తీర్పు ఇచ్చింది ధర్మాసనం. ఈ రోజుల్లో 90 శాతం తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకే పంపిస్తున్నారు. అక్కడ ఫీజుల మోత ఎంతున్నా, వారు రెక్కల కష్టం చేస్తున్నారే తప్ప పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ చదువులే చెప్పిస్తున్నారు. కారణం... చాలా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతలేని వానాకాలం చదువులు ఉండటమే. సర్కారీ బడులు ఎందుకు ఇలా ఉంటున్నాయో, ప్రైవేట్ స్కూళ్లు ఎందుకంత చక్కగా ఉంటున్నాయో మనకు తెలుసు. ప్రభుత్వ స్కూళ్లను చూసినప్పుడల్లా... మనకు... వాటిపై జాలి, అధికారుల అలసత్వంపై ఆగ్రహం రావడం సహజం.
ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టుకు ఇదే అంశం మీద కోపం వచ్చింది. ఆ రాష్ట్రంలో పాఠశాలల దుస్థితి చూసి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడింది. ఇకపై రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, సర్కారీ సిబ్బంది, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్నవారంతా, తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపేలా చేయాలని చీఫ్ సెక్రెటరీని ఆదేశించింది. వాళ్ల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లినప్పుడే ఆ బడులు బాగుపడతాయని వ్యాఖ్యానించింది. స్పాట్ రాష్ట్రంలో చాలా స్కూళ్లు కూలిపోయేలా ఉన్నాయనీ, చదువులు సాగట్లేదంటూ... కొందరు సామాజిక వేత్తలు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఆరు నెలల్లో స్కూళ్లను బాగుచేసి, వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచైనా వాటిలో అన్ని సదుపాయాలూ ఉండేలా చేయాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు, ఆరు నెలల్లో చేసిన అభివృద్ధిని వివరిస్తూ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more