రెండు నిమిషాలు…. రెండే రెండు నిమిషాలు … మీరు వార్తలను వినలేరు… చూడలేరు. దేశవ్యాప్తంగా అన్ని న్యూస్ ఛానళ్లు ‘నవంబర్ 2′న మౌనం పాటించనున్నాయి. ప్రెస్ కైన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపుతో ఎప్పుడూ హడావుడిగా ఉండే న్యూస్ రూమ్స్ లో ఆరోజున రెండు నిమిషాల పాటు నిశ్శబ్దం రాజ్యమేలనుంది. న్యూస్ రూమ్స్ సైలెన్స్ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టింది PCI. గత రెండు దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా జరిగిన 80 మంది జర్నలిస్టుల హత్యలపై ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కేసుల్లో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతీ లేదు. విచారణ అంతా పెండింగ్ లోనే ఉంది. బాధితులకు న్యాయం జరగలేదు. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్ లలో బాధితులు ఎక్కువగా ఉన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది ప్రెస్ కౌన్సిల్. సమాచార హక్కు చట్టంలో విజిల్ బ్లోయర్లకు కల్పించినట్టుగానే జర్నలిస్టులకు రక్షణలు కల్పించాలని డిమాండ్ చేసింది. దీంతో ‘టూ మినిట్స్ సైలెన్స్ ఇన్ న్యూస్ రూమ్స్’ పిలుపునిచ్చింది. ఏటా నవంబర్ 2న మౌనం పాటించనున్నారు.
బీహార్ లో, ఉత్తర్ ప్రదేశ్ లో జర్నలిస్ట్ ల మీద జరుగుతున్న దారుణాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ జర్నలిస్ట్ ను బైక్ కు కట్టేసి చాలా దూరం వరకు లాక్కెళ్లి.. జర్నలిస్ట్ ను ఆస్పత్రిపాలు చేశారు. గుండాలు, రౌడీలు చేస్తున్న దారుణాలను వెలుగులోకి తీసుకువచ్చిన జర్నలిస్ట్ లను వాళ్లు ఎంతో కిరాతకంగా హింసిస్తున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక వ్యాపం కుంభకోణం విఫయంలోనూ అదే జరిగింది. కుంభకోణం గురించి తెలుసుకున్న జర్నలిస్ట్ అతి దారుణంగా మృతి చెందారు. ఇలా దేశంలో నిజాలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్ట్ ల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటిని నిరసిస్తు జర్నలిస్ట్ మిత్రులు రెండు నిమిషాల మౌనానికి పిలుపునిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more