భారతీయ సంస్కృతిలో సత్యం శివం సుందరం ఓ భాగం. ఇప్పుడు అవే పేర్లు పెట్టుకున్న ముగ్గురు సార్ధక నామధేయులయ్యారు. స్వశక్తితో ప్రపంచం ముందు తమ సత్తా చాటుతున్నారు. వాళ్లే సత్య నాదేళ్ల, శివ నాడార్, సుందర్ పిచాయ్. అవును ఆ ముగ్గురే ఇప్పుడు మనకు సత్యం, శివం, సుందరం. భారత దేశానికి గర్వకారణమైన పేర్లు.
అనంతపురం జిల్లాలో పుట్టిన సత్య నాదేళ్ల తెలుగు కీర్తినే.. కాదు భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. కంప్యూటర్పై తనదైనమాయాజాలంతో టెక్నాలజీ రంగాన్ని పరుగులు పెట్టించిన మైక్రోసాఫ్ట్ సంస్థకు సిఇఓగా ఎదిగారు. అపర కుబేరుడు. విండోస్ సృష్టికర్త బిల్గేట్స్కు సరైన వారసుడుగా గుర్తింపు పొందారు. గూగుల్, యాపిల్ వంటి కంపెనీలతో పెరుగుతున్న పోటీని తట్టుకుని టేకొవర్లతో సంస్థను పరుగులు పెట్టిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటూ కొత్త రంగాల్లో అడుగుపెట్టి మరీ కంపెనీకి లాభాల పంట పండిస్తున్నారు మన సత్యం నాదెళ్ల.
ఇక శివ నాడార్... అదే మన శివం. హెచ్సిఎల్ టెక్నాలజీ సంస్థను ఏర్పాటు చేసి లక్షల మందికి ఉపాధి చూపించారు. దేశంలోని అగ్రగామి ఐటీ సంస్థల్లో ఒకటిగా నిలిపారు. డెల్, ఐబిఎం సంస్థలకు ధీటుగా దేశీయ కంప్యూటర్ను మనకు అందించారు. లక్ష కోట్లకు పైగా టర్నొవర్తో ఐటీ కంపెనీని విశ్వవ్యాప్తం చేశారు. అందరికీ మార్గదర్శిగా నిలిచారు. అలా మన శివం సత్తాను లోకానికి చాటుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలను నిత్యం ప్రభావితం చేస్తున్న గూగుల్ సంస్థకు మన సుందరమే సిఇఓగా ఎదిగారు. అకుంఠిత దీక్షతో ఈ స్థాయికి చేరుకున్నారు. ఇప్పటికీ గూగుల్ యజమానులు లారీ పేజ్ వంటి వాళ్లు యువకులే అయినా సుందర్కు బాధ్యతలు అప్పగించడంలో మన సుందరంపై వారికున్న నమ్మకం ఆయన సమర్ధతకు దర్పణం పడుతున్నాయి. మన సత్యం శివం సుందరం ఇప్పుడు వ్యక్తిగతంగా వారు శిఖరస్థాయికి చేరుకున్నారు.. భారత దేశ ప్రతిష్టను పెంచారు. హ్యాట్సప్ సత్యం శివం సుందరం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more