ఉమ్మడి రాష్ట్రాల రాజధాని :హైదరాబాద్ నుంచి విజయవాడ బయలేదేరి వెళ్లిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో విమానాన్ని శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది క్షణాల్లోనే ఈ లోపం తలెత్తింది. అయితే పైలట్ అప్రమత్తంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ విమానంలో టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, చింతమనేని ప్రభాకర్, మోదుగుల వేణుగోపాల రెడ్డిలతో పాటు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు.
పెద్ద ప్రమాదం తప్పడంతో వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఏఐ 544 నెంబరు గల ఈ విమానం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరి టేకాఫ్ తీసుకుంది. తర్వాత పది నిమిషాల్లోనే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. ఏటీసీని సంప్రదించడం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి రావడం.. ఇవన్నీ అయ్యేందుకు మరో 20 నిమిషాల సమయం పట్టింది. దాంతో 4.30 గంటలకు మళ్లీ శంషాబాద్ విమానాశ్రయంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో మొత్తం 81 మంది ప్రయాణికులు ఉన్నారని ఎయిర్ ఇండియా పీఆర్వో చెప్పారు.
ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన తర్వాత ఈ ఘటనపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి.. తాము క్షేమంగా దిగాం కాబట్టి మీడియాతో మాట్లాడుతున్నామని, లేకపోతే గాల్లోనే చనిపయేవాళ్లమని, ఈ పాటికి ఫోటోకు దండలు వేసి విచారణ జరిపిచేవారంతే అంటూ తీవ్రంగా స్పందించారు. నిన్న ఇదే విమానం రెండు గంటలు ఆలస్యంగా వెళ్లిందని... ఈరోజు కూడా ఆలస్యంగానే విజయవాడకు బయల్దేరిందని చెప్పారు. టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత మళ్లీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అన్నారు. ఆ అనౌన్స్ మెంట్ వినగానే ఫ్లైట్ లో వారంతా భయాందోళనకు గురయ్యారని చెప్పారు.
ఎయిరిండియా బాగా పాత విమానాలను వాడుతున్నారని.. ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ప్రణాళిక ప్రకారం పాత విమానాలను స్క్రాప్లోకి నెట్టేయాల్సిన అవసరం ఉందిని కానీ అలా జరగడం లేదని ఆరోపించారు.. డీజీసీఏ తప్పనిసరిగా ప్రతి ఏడాది విమానాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించారు.. మన దేశంలో పేదరికం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో మూలపడిన విమానాలను కూడా వాడుతున్నామని చెప్పుకోచ్చారు. మన విమానాల్లో చాలామంది ప్రముఖులు, సినిమా నటులు, నాయకులు, సామన్యులు అందరూ వెళ్తుంటారు. అయినా సరిగా పట్టించుకోవడం లేదని వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more