ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీహార్ పర్యటన సందర్భంగా ఆయనపై మానవ బాంబు దాడి జరిగే ప్రమాదం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై జరిగినట్టుగానే మోదీపై కూడా మానవ బాంబర్ దాడికి పాల్పడే ప్రమాదం ఉందని తెలిపాయి. నేడు పాట్నా వస్తున్న మోదీ ముజఫర్పూర్ ర్యాలీలో ప్రసంగిస్తారు. మోదీకి ముప్పువున్న దృష్ట్యా గరిష్ఠ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని బీహార్ ప్రభుత్వాన్ని, ఎస్పిజి దళాలను నిఘా వర్గాలు ఆదేశించాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం. 1991లో రాజీవ్ గాంధీపై తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్లో ఏ తరహాలో బాంబు దాడి జరిగిందో అదే తరహాలో మోదీపై దాడి చేయడానికి కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.
Also Read: రాజధానిపై మరోసారి ఉగ్రపంజా! .. హెచ్చరించిన ఐబి
Also Read: పాక్ ఉగ్రవాదుల పక్కా ప్లాన్.. మరో 3 నెలల్లో 26/11 తరహా దాడులు
ఈ తరహా దాడి కోసం శిక్షణ పొందిన మహిళా మావోయిస్టులను ఉపయోగించే అవకాశం ఉందని కూడా సమాచారం . మీడియా ప్రతినిధిగా, పోలీసు అధికారిగా, ఎలక్ట్రీషియన్గా, నిర్వాహకురాలిగా, కార్మికురాలిగా ఏదోక రూపంలో మోదీపై ఆత్మాహుతి దాడి జరిపేందుకు ప్రయత్నం జరిగే అవకాశం ఉందని తమకు సమాచారం అందిందన్నారు. బీహార్ పర్యటన సందర్భంగా ఐఐటి పాట్నా క్యాంపస్ను, దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజనను మోదీ ప్రారంభిస్తారు. ముజఫర్నగర్ ర్యాలీ ద్వారానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ప్రచారానికి శ్రీకారం చుడతారు. ఐబి హెచ్చరికల నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన స్థాయిలోనే ప్రధాని మోదీకి భద్రతను ఏర్పాటు చేస్తున్నామని బీహార్ హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. మోదీకి ఎస్పిజి భద్రత ఉన్నప్పటికీ ఆయన ర్యాలీకి సంబంధించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను బీహార్ ప్రభుత్వం ఆదేశించింది. 2013 అక్టోబర్ 27న పాట్నాలోని గాంధీ మైదాన్లో జరిగిన మోదీ ర్యాలీలో చైన్ బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ సంఘటనలో ఐదుగురు మరణించగా వంద మంది గాయపడ్డారు.
Also Read: గగనతల దాడుల హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more