అసదుద్దీన్ ఓవైసీ.. రాష్ట్రంలోనే కాదు దేశంలో మైనార్టీల తరఫున మాట్లాడే నేతగా పేరుంది. అయితే మనది అసలే భారతదేశం.. అందరికి స్వేచ్చ ఉంటుంది. ఎవరు ఏమైనా మాట్లాడవచ్చు.. ఎంత తీవ్రంగా అయినా సరే వ్యాఖ్యలు చెయ్యవచ్చు. ఓవైసీ ఇలా వ్యాఖ్యలు చెయ్యడం.. కొత్తేమీ కాదు. ఎన్నో సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వాటి మీద పెద్ద దుమారం రేగడం మామూలే. అయితే తాజాగా ముంబై బాంబ్ దాడులకు కారణమైన యాకుబ్ మెమెన్ ను వదిలివెయ్యాలని ఎందుకంటే అతను ముస్లిం కాబట్టి అని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. వందల మంది అమాయకుల ప్రాణాలు తీసిన మంబై బాంబ్ దాడికి కారణమైన మెమెన్ లాంటి వాడిని వదిలిపెట్టాలని ఓవైసీ అనడం చర్చకు తెరతీసింది.
ఓవైసీకి పిచ్చి పట్టింది..
అసదుద్దీన్ ఓవైసీ.. గంతో ఎంతో కీలక నేతగా, మైనార్టీల తరఫున పార్లమెంట్ లో మాట్లాడే వారు. కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఓవైసీ ఎంతో కీలకంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో ఓవైసీ ఏదోలాగా పాత్ర పోషించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. కేవలం గ్రూప్ రాజకీయాలను చేస్తున్నారు. ఓ పార్టీ అధినేతగా మాట్లాడాల్సిన ఓవైసీ కేవలం ఒక మతానికి మాత్రమే అనుకూలంగా మాట్లాడుతూ.. మత పరంగా, రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో కూడా తెలియనంతగా మాట్లాడుతున్నారు. మెమెన్ లాంటి వాళ్లను విడుదల చెయ్యాలి అని డిమాండ్ చెయ్యడం అది కూడా ఓ ముస్లిం కాబట్టి వదిలివెయ్యాలని అని అనడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వ్యాఖ్యలతో అవాక్కైన విమర్శకులు ఓవైసీకి సిచ్చిపట్టిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పిల్లలు కనడం గురించి మీకెందుకు..? అక్బరుద్దీన్
ఓవైసీ గతంలో కూడా అంతే..
అసదుద్దీన్ ఓవైసీ గతంలో కూడా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో భారత్ లా పుట్టిన ప్రతి ఒక్కరు ముస్లిమే అంటూ చెప్పడం వివాదాస్పదమైంది. ఓ ఎంపీగా ఉంటూ ఇలా ఓ మతపరమైన వ్యాఖ్యలు చెయ్యడం ఏంటి అని ఎంతో మంది మండిపడ్డారు. ఏదో సందర్భంలో ఓ మతానికి చెందిన ప్రార్థనా స్థలాల్లో ఏర్పాటుచేసే మీటింగ్ లలో పరుష వ్యాఖ్యలు చేయడం ఓవైసీ స్పెషాలిటి. అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేసినంత మాత్రాన అరెస్టు చెయ్యడం.. పార్లమెంట్ నుండి సస్పెండ్ చెయ్యడం జరగవు ఎందుకంటే భారతదేశంలో అందరికి మాట్లాడే స్వచ్ఛ ఉంది. ఒకవేళ ఎవరైనా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అనుకుంటే మాత్రం తప్పనిసరి అయితే క్షమాపణలు కోరతారు.. అయితే అది కూడా వెటకారంగా. భారతదేశంలో మైనార్టీల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే అసదుద్దీన్ ఓవైసీ లాంటి నేతల ఆటలు ఎన్ని రోజులు నడుస్తాయంటూ అనుకునే వాళ్లు అనుకుంటున్నా.. ఓవైసీ మాత్రం అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే అతనో మహానేత కాబట్టి. మేము ప్రజల పక్షం అంటూ బీరాలు పలికే ఓవైసీ లాంటి వాళ్లు అదే ప్రజల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేసే అవకాశం గ్రేట్ ఇండియాలో తప్ప మరెక్కడ ఉంటుంది.
By Abhinavachary
Also Read: అది బూటకపు ఎన్ కౌంటర్ : అసదుద్దీన్ ఒవైసీ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more