బీజేపీ, తెలుగుదేశం పార్టీలపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతుల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ రైతుల ఇష్టంతో భూములను తీసుకోవాలని చెబితే బీజీపీ మాత్రం బలవంతంగా భుములను తీసుకోవాలని చూస్తోందన్నారు. అలాగే భూములను లాక్కునేందుకు మోదీ రహస్య ఎజెండాతో ఉన్నారన్నారు. ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం టీడీపీ ఎందుకు పోరాడడం లేదని రాహుల్ విమర్శించారు. రైతుల బాధలు టీడీపికి పట్టవా అని ప్రశ్నించారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రాహుల్ గాంధీ చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 50 రూపాయల చొప్పన పంపిణీ చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాహుల్ హామీ ఇచ్చారు. విభజన చట్టంలోని అంశాల్ని బీజేపీ సర్కార్ అమలు పర్చడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదాపై బీజేపీ మాట్లాడడం లేదని ఆయన విమర్శించారు.ఏపీ ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని రాహుల్ విరుచుకుపడ్డారు.
కష్టాల్లో ఉన్న రైతులకు భరోసా ఇచ్చేందుకే వచ్చానన్నారు రాహుల్. ఏపీలో రైతులు, చేనేతలు ఇబ్బందుల్లో ఉన్నారని వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భూములను లాక్కునేందుకు మోదీ రహస్య ఎజెండాతో ఉన్నారు. రైతుల భూములను బీజేపీ సర్కార్ బలవంతంగా గుంజుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందిరమ్మ ఆశయాలు నా రక్తంలో ఉన్నాయి. ఏపీ ప్రజల కష్టాలను తీర్చేందుకు కాంగ్రెస్ పోరాడుతుందని రాహుల్ హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని దుమ్ముదులిపేశారు రాహుల్ గాంధీ.. టీడీపీ విధానాలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే వైసీపీని కూడా వదిలిపెట్టలేదు.. అధికార పార్టీ విధానాలపై ప్రతిపక్షం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఏపీ ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వైసీపీ పోరాడకపోయినా మేం మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని రాహుల్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more