ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాకు చేరుకున్నారు. అనంతపురం కొడికొండ చెక్ పోస్ట్ కు చేరుకున్న రాహుల్ గాంధీకి ఏపి కాంగ్రెస్ నాయకులు భారీ స్వాగతం పలికారు. ఏపి పిసిసి చీఫ్ తో సహా పలువురు కీలక నేతలు రాహుల్ కు స్వాగతం పలికారు. అయితే రాహుల్ పర్యటనను నిరసిస్తు టిడిపి నాయకులు ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుండి తరలించారు. రైతుల సమస్యలు తెలుసుకుని, స్వయంగా పరామర్శించే లక్ష్యంతోనే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ ఇప్పటికే పెద్దస్థాయిలో ప్రచారం చేసింది. ఓబుళదేవర చెరువు వద్ద బహిరంగ సభలో ప్రసంగంతో అనంతరం రాహుల్ గాంధీ పది కిలోమీటర్ల పాదయాత్ర మొదలవుతుంది. 1979లో తన నాన్నమ్మ , దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ప్రసంగించిన ప్రదేశంలోనే రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
Also Read: డ్రగ్స్ తో పట్టుబడిన రాహుల్ గాంధీ..?
పదికిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా రైతులను పరామర్శించి, వారి సమస్యలను తెలుసుకుంటారు. అలాగే , నేత కార్మికులు, విద్యార్థులు, యువతతో మమేకమవుతారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. పాదయాత్ర ముగిసిన తర్వాత పుట్టపర్తి వెళ్లి శ్రీ సత్యసాయిబాబా మహాసమాధిని సందర్శిస్తారు. పాదయాత్రలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ , డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు సమర్పించడంతో పాటు జాతీయ ఉపాధి హామీ పథకం కార్మికులు, వలస కార్మికులతో నూ భేటీ జరుపుతారు. ఆత్మహత్యచేసుకుని చనిపోయిన హరినాథ్ రెడ్డి అనే రైతు కుటుంబాన్ని కూడా రాహుల్ పరామర్శిస్తారు. గత మే నెలలో తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో పాదయాత్ర జరిపారు.
Also Read: మరో బాంబు పేల్చిన లలిత్ మోడీ.. రాహుల్, ప్రియాంకలను కలిశా..
రాష్ట్ర ప్రజలు, రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో రైతులు, చేనేత కార్మికుల సమస్యలు, వలసలు పెరిగిపోతున్నందున భరోసా ఇచ్చేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర, కేంద్ర పభుత్వాల వైఫల్యాలే ప్రజల సమస్యలకు కారణమని రఘువీరారెడ్డి విమర్శించారు. మరి ఏపి కాంగ్రెస్ కు రాహుల్ గాంధీ పర్యటన ఊపిరిపోస్తుందో లేదా అలానే వెంటిలేటర్ మీద ఉంటుందో చూడాలి.
Also Read: ఇక లలిత్ మోదీ టార్గెట్ రాహుల్ గాంధీ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more