గోదావరి పుష్కరాలు నేడు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పుష్కరఘాట్ల వద్ద భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పుష్కర, కోటిలింగాల ఘాట్ల వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో పాటు కోటిపల్లిరేవు, మురమళ్ల, ముక్తేశ్వరం, రావులపాలెం, అంతర్వేది తదితర ప్రాంతాల్లోనూ పెద్దయెత్తున భక్తులు పుష్కరస్నానాలు చేస్తున్నారు. తెల్లవారుజామునుంచే పుష్కరస్నానాలకు వస్తున్న భక్తులతో ఘాట్లన్నీ రద్దీగా మారాయి. అలాగే పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, నర్సాపురం, సిద్ధాంతం, పట్టిసీమ తదితర ప్రాంతాల్లో భారీసంఖ్యలో భక్తులు పుష్కరఘాట్లకు తరలివస్తున్నారు. అటు గోదావరి పుష్కరాల సందర్భంగా తెలంగాణలోని పుష్కరఘాట్ల వద్ద రద్దీ కొనసాగుతోంది. భద్రాచలం,పర్ణశాల, మోతె, ధర్మపురి, కాళేశ్వరం, బాసర, పోచంపాడ్ తదితర క్షేత్రాల్లో పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తుతున్నారు. పుణ్యస్నానాలు అనంతరం దైవదర్శనానికి బారులు తీరడంతో ఆలయాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి.
Also Read: పుష్కరాల్లో గాలం వేస్తే డబ్బులే డబ్బులు
గోదావరి మహా పుష్కరాలకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. సెలవు రోజుల్లో రద్దీ అనూహ్యంగా పెరిగినా, మిగతా రోజుల్లో ఎప్పటిలాగే పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సంఖ్య స్థిరంగా కొనసాగుతున్నది. మరో ఐదు రోజుల్లో పుష్కరాలు ముగియనుండడంతో బుధవారం నుంచి భక్తుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉన్నదని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తున్నది. చివరి రెండు రోజుల్లో రద్దీని అంచనా వేసి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే తెలంగాణ వ్యాప్తంగా 29,27,000 మంది పుణ్యస్నానాలు చేశారు. ఇప్పటి వరకు మూడు కోట్ల మంది స్నానాలు చేశారని, పుష్కరాలు ముగిసేనాటికి మొత్తం ఆరు కోట్ల మంది స్నానాలు చేసే అవకాశం ఉందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పుష్కర ఘాట్లను మంత్రి పరిశీలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more