గోదావరి మహా పుష్కరాల్లో జన సందోహం ఎలా ఉందో గత వారం రోజుల నుండి చూస్తేనే ఉన్నాం. తండోపతండాలుగా భక్తులు గోదావరికి పోటెత్తారు. ఇక శని, ఆది వారాల్లె అయితే ఇసకేస్తే రాలపంత జనం గోదావరిలో కనిపించారు. గోదావరిలో ఒక్కొక్క నీటి చుక్కల్లా భక్తులు కనిపించారు. అయితే గోదావరి పుష్కరాల వల్ల అక్కడికి వచ్చిన వాళ్లకు ఆనందం, ఆధ్యాత్మిక భావం కలుగుతోంది. ఇక అక్కడే ఉంటున్న వారికి నయనానందం, వ్యాపారులకు లాభాలే లాభాలు. ఇక మరి ఎవరికీ నష్టం కలగడం లేదు అనుకుంటున్నారా..? లేదు లేదు. ఒక్కరికి మాత్రం నష్టం కలుగుతోంది. ఎవరికి అనుకుంటారా..? అది ఒక్క మత్సకారులకే.
అవును మత్సకారులు అదే చేపలు పట్టేవారు. సంవత్సరంలో 365 రోజులు గోదారమ్మను నమ్ముకున్న వారికి గోదావరి మహా పుష్కరాల కారణంగా నష్టం కలుగుతోంది. ఎందుకు అనుకుంటున్నారా..? గోదావరి పుష్కరాలు ఉన్నన్ని రోజులు నదిలోకి వెళ్లి చేపలు పట్టలేరు కాబట్టి. అయితే ఓ యాడ్ లో చూపించినట్లు ఐడియా కెన్ ఛేంజ్ యువర్ లైఫ్ అన్నట్లు.. మత్సకారుల ఓ ఐడియా కాసులు కురిపిస్తోంది. ఏంటా ఐడియా అనుకుంటున్నారా..? అదేంటంటే ఎలాగూ వేటకు వెళ్లలేరు కాబట్టి పుష్కరాలు జరుగతున్న ఘాట్ లలో చిన్న చిన్న బోట్ లు వేసుకొని తిరుగుతున్నారు. అయస్కాంతాలను పుష్కరాలకు వచ్చిన భక్తులు తమ కోరికను తీర్చాలంటూ గోదావరి తల్లికి నాణెలు వదులుతుంటారు. ఒక రూపాయి, రెండు ఐదు, పది రూపాయల నాణేలను వదలుతుంటారు. అయితే ఈ డబ్బుల మీదే మత్పకారులు దృష్టి సారించారు. చిన్న చిన్న బోట్ లలో తిరుగుతూ అయస్కాంతాలను కర్రలకు చుట్టి నీళ్లలోకి వదులుతున్నారు. అలా నీటిలోకి వదలడం వల్ల నాణేలు అయస్కాంతానికి అతుకుతున్నాయి. ఇంకేముంది వాటిని అలా ఒడిసిపట్టి... కాసుల వర్షంలో తేలుతున్నారు. అయినా తెలివి ఉండాలే కానీ ఆదాయానికి కొదువా చెప్పండి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more