Khushboo Attract congress leaders with her speach | Congress party | tamilnadu congress women president

Khushboo attract congress leaders with her speach in campaign

Khushboo news, tamil actress Khushboo, actress Khushboo, Khushboo congress, Khushboo speech, Khushboo updates, Khushboo hot photos, Khushboo in politics, Khushboo photo gallery, Khushboo protests, Khushboo news

Khushboo Attract congress leaders with her speach in campaign : All India Congress Committee spokesperson Khushboo Attracts cogress leaders and people with her latest speech. She said that if there is any problem in streets then just call once i will be their to prostest against that.

ఒక్క ఫోన్ కొడితే.. ‘ఖుష్బూ’ వీధుల్లోకి వాలిపోతుందట!

Posted: 06/30/2015 10:02 AM IST
Khushboo attract congress leaders with her speach in campaign

తనదైన నటనాశైలితో దక్షణాది సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ఖుష్బూ.. ఇప్పుడు జనాల్లో మరింత మమేకమయ్యేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక్క ఫోన్ కొడితే చాలు.. తాను స్వయంగా వీధుల్లోకి వాలిపోతానని ఆమె స్వయంగా పేర్కోవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇంతేకాదు.. ఈమె ఇచ్చిన బహిరంగ ప్రసంగానికి జనాలు ఒక్కసారిగా ఉప్పొంగిపోయి ఆమెను చప్పట్లతో ముంచెత్తారు. ఇంతకీ ఆమె ఏం చెప్పింది..? వీధుల్లోకి ఎందుకు వస్తానంది..? ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఏంటి..? అని అనుకుంటున్నారా..! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

సినీపరిశ్రమ ద్వారా దేవతలా తమిళ ప్రేక్షకుల హృదయాల్లో గుడి కట్టించుకున్న ఖుష్బూ.. ఇప్పుడు రాజకీయరంగంలో తన సత్తా చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈమె తనదైన శైలిలో ప్రసంగాలు ఇస్తూ ప్రజల్ని తనవైపుకు మరలించుకోవడమే కాకుండా.. పార్టీ పెద్దల్ని ఆకట్టుకుంటోంది. ఇందుకు నిదర్శనంగా తాజాగా ఆమె ఇచ్చిన ప్రసంగమే ఉదాహరణగా తీసుకోవచ్చు. తమిళనాడు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న ఖుష్బూ ఓ సందర్భంలో ఈ విధంగా ప్రసంగించింది.. ‘ఏదైనా సమస్యపై పోరాటం చేయాలని భావించేవారు నాకు ఒక్క ఫోన్ కొడితే చాలు.. స్వయంగా వచ్చి వీధి పోరాటాలు చేస్తాను’ అని ఆమె పిలుపునివ్వడం అక్కడున్న జనాల్లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో వారు ఆమెను జనాలు చప్పట్లతో ముంచెత్తారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శోజా ఓజా ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల ఎంపిక కోసం తమిళనాడులో ఓ సమావేశం జరిగింది. ఈ పదవి కోసం పలువురు సీనియర్ నేతలు పోటీపడ్డారు. ఆ సమావేశంలో వారు తమతమ రీతిలో ప్రసంగాలు చేశారు. అయితే.. వారందరికి భిన్నంగా ఖుష్బూ తనదైన శైలిలో ప్రసంగించి కాంగ్రెస్ కార్యకర్తలతో, జనాలతో చప్పట్లు కొట్టించుకున్నారు. ఇంటిపక్క సమస్యైనా, నియోజకవర్గ సమస్యైనా పోరాటం చేయాల్సి వస్తే.. తనవద్దకు నేరుగా రావాల్సిన అవసరం లేదని, ఒక్క ఫోన్ చేస్తే చాలని ఆమె పేర్కొంది. ప్రజల కోసం శ్రమించేందుకు, ఉద్యమాలు చేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగానే వుంటానని ఆమె తెలిపింది. ఇలా ఈ విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి.

అలాగే.. పార్టీ అధికార ప్రతినిధిగా వున్న తనను ప్రతి చోటకు ఆహ్వానించే అవకాశం లేదని, అధికారిక కార్యకర్తలకు వుందని ఖుష్బూ వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఆమె ప్రసంగించడంతో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల పదవికి ఈమెనే ఇవ్వాలని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారని తెలుస్తోంది. మహిళా అధ్యక్షురాలి పదవికి ప్రజాకర్షణ కల్గిన నేతను ఎంపిక చేయాలని లక్ష్యంతో వున్న ఏసీసీసీ.. అందుకు అన్నిరకాల అర్హతలు నటి ఖుష్బూకు వున్నాయని అభిప్రాయాలు వెల్లడిస్తున్నారట. దీంతో.. ఆమె నియామకం దాదాపు ఖరారైనట్టేనని సమాచారం. మొత్తానికి ఖుష్బూ చిత్రపరిశ్రమలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ తన సత్తా చాటుకోవడం సక్సెస్ అవుతోందన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khushboo  congress committee  tamilnadu congress  

Other Articles