నిత్యం రాజకీయ వాతావరణంతో వాడివేడిగా ఉండి దేశరాజధాని ఢిల్లీ నగరం యోగాలయంగా మారింది. యోగాసనాలతో జాతికి ఆరోగ్యదిశా నిర్దేశం చేసింది. తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్పథ్ ప్రధాన వేదికగా జరిగిన ఈ వేడుకలో దాదాపు 40 వేలమంది పాల్గొని సామూహిక యోగాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముందు వరుసలో కూర్చుని, స్వయంగా యోగాసనాలు వేస్తూ అందరిలోనూ స్ఫూర్తిని నింపారు. ముందుగా అక్కడున్నవారితో సూక్ష్మ వ్యాయామం, శ్వాసతో ముడిపడిన పలు యోగా ప్రక్రియలు చేయించారు. అందరికీ అర్థమయ్యేలా హిందీ, ఆంగ్ల భాషల్లో సూచనలిచ్చారు. తాడాసనం, వృక్షాసనం, పాదహస్తాసనం, అర్థచక్రాసనం, త్రికోణాసనం, దండాసనం, వక్రాసనం వంటి పలు ఆసనాలు వేయిస్తూ... ఈ ఆసనాలు మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించారు. ఏ వ్యాధులను నివారించుకోవచ్చో తెలిపారు.
అంతకుముందు ప్రధాని అక్కడున్నవారిని ఉద్దేశించి మాట్లాడుతూ రాజ్పథ్ యోగాపథ్ అవుతుందని ఎప్పుడైనా ఊహించారా? అని అడిగారు. శాంతి, సద్భావన కోసమే యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, యోగా ఒక రోజుకు పరిమితం కాదని అన్నారు. ప్రజాజీవితంలో యోగా సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. సమస్యలను యోగా దూరం చేస్తుందని, మానసిక వికాసాన్ని కలిగించి అంతఃస్సౌందర్యాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ప్రధాని ప్రసంగం తర్వాత ప్రార్థనతో యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్రమంత్రులు, ఎంపీలు, అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అటు రాష్ట్రపతి భవన్లో ఆదివారం ఉదయం యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భద్రతా సిబ్బంది యోగా సెంటర్కు వెళ్లారు. యోగా చేస్తూ అందరూ సుఖ శాంతులతో ఉండాలని ప్రణబ్ ఆకాంక్షించారు. యోగా భారత్ సొంతమని, ఇప్పుడు విశ్వవ్యాప్తమైందని ఆయన చెప్పారు. ప్రపంచ యోగా దినోత్సవం దేశానికే గర్వకారణమని రాష్ట్రపతి అన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more