తెలంగాణ తెలుగుదేశం పార్టీ కీలక నేత రేవంత్ రెడ్డి అరెస్టు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ దుమారం కుదిపేస్తోంది. అయితే చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంత్రి ఏపి మంత్రులు, తెలుగుదేశం పార్టీ కీలకనేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ, ఏపి అధికారులు మండిపడుతున్నారు. ఇదే అంశాన్ని కేంద్ర దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే తన ఫోన్లను ట్యాప్ చెయ్యడంపై స్వయంగా చంద్రబాబు స్పందించారు. నా ఫోన్లను ట్యాప్ చెయ్యడానికి మీరెవరు.. నేను వ్యక్తిని కాదు ఓ రాష్ట్రానికి సిఎంని అంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి చంద్రబాబుతో సహా కీలకనేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అన్న వార్తలపై ఓ తెలంగాణ మంత్రి వివరణ ఇచ్చారు. ట్యాపింగ్ చేస్తున్న మాట వాస్తవమే అంటూ నిజం ఒప్పుకున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి..? ఏం నిజం ఒప్పుకున్నారు..? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే స్టోరీ చదవాల్సిందే.
ఏపి సిఎం చంద్రబాబు నాయుడు తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే తాము ఎవరి ఫోన్టలను ట్యాప్ చెయ్యలేదని తెలంగాణ మంత్రలు కొంత మంది వివరణ కూడా ఇచ్చుకున్నారు. కానీ ఏపి అధికారులు సేకరించిన సాక్షాల ఆధారంగా ట్యాపింగ్ జరిగింది అని ఏపి అదికారులు, తెలుగుదేశం నాయకులు గట్టిగా వాదిస్తున్నారు. అయితే తాజాగా ట్యాపింగ్ చేస్తున్న మాట వాస్తమే అంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ట్యాపింగ్ వ్యవహారంపై గుట్టురట్టు చేశారు తుమ్మల నాగేశ్వర్ రావ్. అయితే ట్యాపింగ్ చేస్తున్న మాట వాస్తవమే కానీ చంద్రబాబు నాయుడు ఫోన్ ను ట్యాప్ చెయ్యలేదని బ్రోకర్ ఫోన్ ను ట్యాప్ చేశామని వివరణ ఇచ్చుకున్నారు తమ్మినేని. మొత్తానికి ట్యాపింగ్ పై ఏపి చేస్తున్న వాదనకు తమ్మినేని మాటలు మరింత బలాన్నిస్తున్నాయి. మరి దీనిపై ఏపి ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more