తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ముగింపులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన వేదికకు సాయంత్రం చేరుకున్న కేసీఆర్ చివరి దాకా ఉత్సవాలను ఇంట్రస్టింగ్ గా చూశారు. ముగింపు ఉత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ మీద లక్ష లడ్డూల పంపిణి చేశారు అదికారులు. అయితే మూడు రోజుల ముందే లడ్డూల పంపిణి చెయ్యాలని తెలంగాణ సర్కార్ యోచించింది. వేడుకల్లో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ముందుండి చూశారు కేసీఆర్. వేలాదిగా చేరుకున్న తెలంగాణవాదులతో ట్యాంక్ బండ్ కళకళలాడింది. అయితే ఇక్కడో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. తెలంగాణ ముగింపు ఉత్సవాల్లో అసలు లడ్డూల పంపిణీ లేదని.. కానీ తరువాత దాన్ని చేర్చారని సమాచారం. అయితే అది కూడా కేసీఆర్ స్వయంగా తీసుకున్న నిర్ణయమని తెలుస్తోంది.
తెలంగాణ ముగింపు ఉత్సవాల్లో బాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ మీద స్వయంగా లడ్డూలను గవర్నర్ దంపతులకు పంపిణీ చేశారు. వేదిక మీద ఉన్న సానియా మీర్జాకు స్వయంగా లడ్డూ తినిపించారు కేసీఆర్. అయితే లడ్డూల వెనుక మరో కోణం ఉంది అని ప్రచారం సాగుతోంది. తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి అరెస్టుతో స్వీట్లు పంచుకోవాలని నిర్ణయించారట. అయితే తెలంగాణ ముగింపు ఉత్సవాల్లో బాగంగా కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ఆడియో టేపులు మీడియాకు అందే సమయానికి లడ్డూల పంపిణీ చెయ్యాలని కేసీఆర్ ప్లాన్ చేశారట. మొత్తానికి లడ్డూల వెనుక కేసీఆర్ ఇంత ప్లాన్ చేశారంటూ తెగ మాట్లాడుకుంటున్నారట కొంత మంది నేతలు. మరి ఇది నిజమో.. లడ్డూల వెనుక కేసీఆర్ ఇంత ప్లాన్ వేశారో లేదో ఆయనకే తెలియాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more