former minister kavuri sensational comments on UPA

Kavuri sambasiva rao attended in janakalyan parv in vizinagaram

former minister kavuri sensational comments on UPA, former minister kavuri sambasiva rao, kavuri sambasiva rao, kavuri sensational comments on UPA regime, bjp janakalyan parv, vizinagaram, sonia gandhi, rahul gandhi, chiranjeevi, raghuveera reddy

former minister kavuri sambasiva rao sensational comments on UPA regime at janakalyan parv in vizinagaram,

మోదీ సర్కార్ లో అంతా నీతివంత అమాత్యులే..

Posted: 05/27/2015 01:24 PM IST
Kavuri sambasiva rao attended in janakalyan parv in vizinagaram

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలకు తెర తీశారు. గతంలో 10 ఏళ్లు పాటు సాగిన యూపీఏ ప్రభుత్వంలో అవినీతి మంత్రులు ఉన్నారని ఆరోపించారు. అయితే ప్రస్తుతం ఎన్డీఏ హయాంలోని మోదీ ప్రభుత్వంలో అలాంటి మంత్రులు లేరని తెలిపారు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దేశ ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి అయ్యిన సందర్భాన్ని పుర్స్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జన కల్యాణ్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా విజయనగరం పట్టణంలో ఆయన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యూపీఏ అధికారంలో వున్న పదేళ్ల సమయంలో ప్రభుత్వంలో అవీనితి మంత్రులు వున్నారని వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదా వస్తే తప్ప.. ఏపీ అభివృద్ధి సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన అశాస్త్రీయంగా జరగిందని పేర్కోన్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీపై ఉందన్నారు. ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని, ఇప్పుడు చేతులెత్తేయడం సరికాదని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కచ్చితంగా ఇచ్చి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. అనేక రాష్ట్రాలు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కొంత ఆలస్యమైనా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తప్పక లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kavuri sambasiva rao  janakalyan parv  sensational comments  UPA regime  

Other Articles