నారా చంద్రబాబు నాయడు గండిపేటలో సాగుతున్న మహానాడులో ప్రతిపక్ష, పాలక పక్ష పార్టీల మీద నిప్పులు చెరిగారు. ఏపిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహారంపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎలాంటి అవినీతికి తావులేదని అంటూనే.. అవినీతికి పాల్పడ్డ వారిని వదిలిపెట్టే పరిస్థితి లేదని అన్నారు. పరోక్షంగా జగన్ మోహన్ రెడ్డిని వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ పై ఐతే మరీ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తెలుగుజాతికి నష్టం కలిగిందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలొ రైతులు తీవ్రంగా నష్టపోయారని, కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు అన్నీ కాంట్రాక్టర్ లను ఉద్దరించడానికే అని మండిపడ్డారు. జగన్ అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని అన్నారు.
కాంగ్రెస్ సప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి రాజ్యమేలిందని, తరువాతి ఐదేళ్లుపూర్తిగా అనిశ్చితి నెలకొందని చంద్రబాబు వివరించారు. పారిశ్రామిక వేత్తల నుండి కమీషన్ లు తీసుకున్నారని కానీ ఇప్పుడు మాత్రం జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చిందని అన్నారు. తెలంగాణ లో ప్రస్తుతం బడ్జెట్ మిగలులో ఉంది అంటే ఒక్క చంద్రబాబు వల్ల, ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లే అని అన్నారు. తెలంగాణలో వేల పరిశ్రమలను తీసుకువచ్చి, హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీదే అని చంద్రబాబు వివరణ. చాలా మంది తెలుగు తమ్ముళ్లను తెలంగాణలో తమ పార్టీలోకి చేర్చుకున ప్రయత్నాలు చేసిందని కానీ తెలుగు తమ్ముళ్లు మాత్రం ప్రలోభాలకు లొగ్గలేదని తెలిపారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more