Husband Ramesh try to kill his wife Rani after who already burned herself | crime news

Husband ramesh try to kill his wife after who already burned herself

husband ramesh, wife rani, women burned herself, women suicide news, crime news, vijayawada govt hospital

Husband Ramesh try to kill his wife after who already burned herself : A husband names ramesh try to kill his wife who already commit suicide and taking treatement in hospital. This incident happened in vijayawada hospital.

‘నువ్వింకా చావలేదా..? అయితే ఇప్పుడు చావు!’

Posted: 05/25/2015 11:03 AM IST
Husband ramesh try to kill his wife after who already burned herself

తమ దాంపత్య జీవితం సుఖంగా కొనసాగాలని భర్త పెట్టే వేధింపులు సైతం భార్యలు అనుభవిస్తుంటారు. కట్టుకున్న భర్తే తమకు దేవుడు, సర్వస్వం అనే భావించి జీవితాంతం వారి సేవలోనే మునిగిపోతారు మహిళలు! ఇందుకు అనుగుణంగా కొందరు భర్తలు తమ భార్యల్ని సంతోషపెట్టడంలో సక్సెస్ అవుతున్నారు కానీ.. కొందరు భర్తలు మాత్రం మగాళ్లన్న అహంకారంతో వారు చూపించే ప్రేమను ఏమాత్రం అర్థం చేసుకోక రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది.

భర్త వేధింపులు భరించలేక ఓ భార్య ఒంటికి నిప్పంటించుకుంది. దీంతో తీవ్రమైన కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరింది. చావుఅంచులదాకా వెళ్లి బతికిన ఆమెను ఆ దుర్మార్గుడు అక్కడా వదల్లేదు. ‘నువ్వింకా చావలేదా’ అని క్రూరంగా ప్రవర్తిస్తూ గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. కృష్ణాజిల్లా ఎ.కొండూరు మండలంలోని పూలచెట్టుపాడుకు చెందిన రమేష్.. ఈ విధంగా తన భార్యను చంపేందుకు ప్రయత్నించాడు.

పూలచెట్టుపాడురగ చెందిన కొమ్ము రమేష్‌ మొదటి భార్య కొన్నేళ్ల క్రితం నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆరేళ్ల క్రితం అతగాడు రాణిని రెండో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు వీరి జీవితం సాఫీగానే కొనసాగింది కానీ.. రానురాను రమేష్ తన భార్య రాణి పట్ల రాక్షసుడిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మొదట తన భర్త మారుతాడని రాణి ఆశించింది కానీ.. అలా జరగక అతని వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ప్రతీరోజూ ఆ రాక్షసుడు రాణిని వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో ఆ వేధింపులకు తాళలేక ఆమె బుధవారం నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాణిని బంధువులు తిరువూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే.. అక్కడి వైద్యులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో మూడు రోజుల క్రితం ఆమెను ఆ ఆస్పత్రికి తరలించారు. రాణిని చూసేందుకని ఆదివారం ఆస్పత్రికి వచ్చిన రమేశ్‌ ‘నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. చనిపోలేదా?’ అంటూ గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. రాణి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramesh  wife rani  women suicide cases  

Other Articles