పంజాబ్ రాష్ట్రంలో అబలలపై దారుణాలు పెచ్చుమీరుతున్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మైనర్ బాలికపై..తోటి ప్రయాణికులలోని మగమృగాళ్లు అత్యాచారానికి యత్నించి.. అందుకు సహకరించని చిన్నారి బాలికను కదులుతున్న బస్సు నుంచి తోసివేయడంతో మరణించిన ఘటన మరువక ముందే.. అదే రాష్ట్రంలో.. అదే ప్రాంతంలో మరో అబాగినిపై మగమృగాళ్లు పైశాచిక చర్యకు తెగబడ్డాయి. పంజాబ్ లోని మోగా జిల్లాలోనే ఈ దుర్మార్గం చోటుచేసుకుంది. దాదాపు పదకొండు మంది వ్యక్తులు ఓ యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణానికి పాల్పడినవారిలో బాధితురాలి స్నేహితురాలి భర్త కూడా ఉన్నాడు.
పోలీసులు వివరాల ప్రకారం.. బాధితురాలు తన స్నేహితురాలిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్లింది. స్నేహితురాలి కోసం ఎదురుచూస్తుండగా అంతలో వచ్చిన ఆమె భర్త మరికొందరు కలసి అదే గ్రామంలోని ఓ పాడుబడ్డ ఇంట్లోకి ఎత్తుకెళ్లారు. బాధితురాలు వారిని నిలువరించేందుకు ఎంత ప్రయత్నించినా కొట్టి మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు వివరాలు సేకరించిన పోలీసులు బాధితురాలిని మెడికల్ పరీక్షల కోసం పంపించారు. ఆమె స్నేహితురాలు, భర్త మిగితావారిపై కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.
సాక్షాత్తు.. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, సుఖ్ బీర్ సింగ్ బాదల్ లకు చెందిన కంపెనీ ఆర్బిట్ ఏవిషన్ సంస్థకు చెందిన బస్సులో ఘటన జరిగిన నేపథ్యంలో పెట్రోలింగ్ సహా బందోబస్తులను అప్రమత్తం చేయాల్సిన పోలీసులు.. ఒక ఘటన వెలుగుచూసిన తరువాత కూడా తమకు పట్టనట్టు మొద్దునిద్రను వీడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలావుండగా, సదరు బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందని వైద్యుల ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నా.. పోలీసులు మాత్రం గ్యాంగ్ రేప్ జరగలేదని, బాధితురాలి పేరును మీడియా సమావేశంలో పలుమార్లు బహిర్గత పర్చడం వారి అకుంఠిత పనితీరుకు దర్పణం పడుతోంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more