అప్పుడెప్పుడో వెళ్లిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. గత కొంత కాలంగా కనిపించకుండా పోయిన రాహుల్ బాబు తిరిగి రావడంపై కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్ కార్యలయం, సోనియాగాంధీ ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకుల సందడి నెలకొంది. రాహుల్ గాంధీ ధాయ్ ఏయిర్ వేస్ ద్వారా డిల్లీకి చేరుకున్నట్లు ది సండే గార్డియన్ అనే పత్రిక ప్రచురించింది. తన చిన్ననాటి స్నేహితుడు సమీర్ శర్మతో కలిసి రాహుల్ కొన్నాళ్లు గడిపినట్లు సమాచారం. అయితే రాహుల్ గాంధీ రాక పై మీడియాలో మోత మోగుతోంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ అని తేడా లేకుండా అన్ని చోట్ల రాహుల్ గాంధీ గురించే చర్చ సాగుతోంది. ట్విట్టర్ లో అయితే రాహుల్ గురించి కామెంట్లే కామెంట్లు వస్తున్నాయి. రాహుల్ గాంధీ నెట్ న్యూట్రినిటి కోసం ర్యాలీలో పాల్గొనాలి అని ఇచ్చిన పిలుపుకు స్పందన బాగానే వస్తోంది. నెట్ లో ప్రస్తుతం ఎక్కువగా రాహుల్ గాంధీ గురించే సెర్చ్ చేస్తున్నారట.
అయితే రాహుల్ గాంధీ తర్వాత పాల్గొంటున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 19 న రాహుల్ గాంధీ రైతుల ర్యాలీలో పాల్గొంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. రేపు కాంగ్రెస్ నాయకులతో కలిసి మీటింగ్ నిర్వహించనున్నారని కూడా పిసి చాకో స్పష్టం చేశారు. అయితే రాహుల్ గాంధీ కనిపించకుండా పోయిన విషయం అడిగితే మాత్రం అది ఆయన వ్యక్తిగత అంశం అని అన్నారు. ప్రతి ఒక్కరికి ప్రైవసీ హక్కు ఉంది అని పిసి చాకో అన్నారు. మొత్తానికి ఢిల్లీ చేరిన రాహుల్ గురించి సర్వత్రా చర్చ మాత్రం హాట్ హాట్ గా సాగుతోంది. మరి రేపటి నుండి రాహుల్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరో పక్క రాహుల్ గాంధీ తిరిగి రావడంతో కాంగ్రెస్ లో ఆనందం వెల్లివిరుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఏకంగా ఆనందంతో టపాసులు పేల్చారు. ఎన్నికల సమయంలో పార్టీ గెలిచినపుడు ఎంత సందడి ఉంటుందో అంతలా సందడి చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మరి దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.ౌ
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more