ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా నాకౌట్ ధశలో మెల్ బోర్న వేదికగా బంగ్లదేశ్ తో జరగనున్న రెండవ క్వార్టర్ ఫైనల్స్ లో టీమిండియా చివరి ఓవర్లలో ధాటిగా ఆడింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు విక్కెట్లు నష్టపోయి బంగ్లాదేశ్ ముందు 303 పరుగులు విజయలక్ష్యాన్ని వుంచింది. తొలి ముఫై ఓవర్లలో తడబాటుకు గురైన ధోణిసేన ఆ తరువాత చివరి ఓవర్లలో కోలుకుని బంగ్లాదేశ్ బౌలర్లు ఉతికి ఆరేసింది. ముఖ్యంగా టీమిండియా స్కోరు బోర్డును రోహిత్ శర్మ, సురేష్ రైనాలు పరుగులు పెట్టించారు. 126 బంతులను ఎదుర్కోన్న రోహిత్ ధాటిగా ఆడి.. 14 ఫోర్లు, మూడు సిక్స్ ల సాయంతో 137 పరుగులు సాధించాడు. అటు సురేష్ రైనా కూడా బంగ్లా బౌలర్లను చితకబాదాడు. 57 బంతులను ఎదుర్కోన్న రైనా.. 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 65 పరుగులను సాధించాడు. చివరి పది ఓవర్లలో భారత్ 97 పరుగులు సాధించింది.
ఓపెనర్ శిఖార్ ధావన్ 30 పరుగులు చేసి 16.3 ఓవర్లో 30 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలీయన్ చేరాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో క్రీజ్ లోకి వచ్చిన అజ్యింక రహానే అచితూడి ఆడుతూ రోహిత్ శర్మతో కలసి నెమ్మదిగా స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యి వెనుదిరిగడంతో క్రీజ్ లోకి వచ్చిన సురేష్ రైనా ధాటిగా ఆడుతూ బంగ్లా బౌలర్లను కంగారు పెట్టించాడు. చివరిలో వచ్చిన జేడాజా కూడా ధాటిగా ఆడి కేవలం 8 బంతులలోనే ఒక్క పోరు సాయంతో 21 పరుగులు సాధించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 302 పరుగులు సాధించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ మూడు విక్కెట్లను చేజిక్కించుకోగా, మొర్తాజా, రుబెల్, షకీబ్ తలో వికెట్ సాధించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more