రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. కులాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించడం కుదరదని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. జాట్ లకు ఒబిసి రిజర్వేషన్లు కల్పిస్తు గతంలో యుపిఎ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. కేవలం కులం ఆధారంగా వెనబడిన వారిగా గుర్తించడం తగదని, జాట్ లను ఒబిసి జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది. దాదాపు తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న జాట్ వర్గాలకు మేలు చేసేలా అప్పటి యుపిఎ ప్రభుత్వం అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జాట్ లను ఒబిసిలుగా గుర్తిస్తు జీవో జారి చేసింది.
జాట్ లను ఒబిసి జాబితాలో చేరుస్తూ అప్పటి యుపిఎ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఒబిసి రిజర్వేషన్ రక్షా సమితిసవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై స్పందించిన కోర్టు తాజాగా జాట్ లకు రిజర్వేషన్లను ఇవ్వడం కుదరదంటూ తీర్పునిచ్చింది. అయితే సుప్రీం కోర్టు తీర్పుపై ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. రాజస్థాన్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో మెజారిటీ కలిగిన జాట్ వర్గం వారు అక్కడి ప్రభుత్వ ఏర్పాటులో ఎంతో కీలకం. అయితే జాట్ ఓటు బ్యాంక్ ను దృష్టిలో పెట్టుకొని అప్పటి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను కల్పిస్తు నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్రం కల్పిస్తున్న రిజర్వేషన్లలలో హేతుబద్దత లేదని కోర్టు తెలిపింది. కేవలం కులం మాత్రమే వెనబాటుతననానికి ప్రమాణం కాదని, రిజర్వేషన్లు కల్పించాలంటే సహేతుక కారణాలు ఉండాలని కోర్టు అభిప్రాయపడింది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more