Delhi police said that they may question pakistani journalist mehr tarar

Mehr Tarar, Sunanda Pushkar, Delhi police, Pakistani journalist

Delhi police on Thursday said that they may question Pakistani journalist Mehr Tarar in the Sunanda Pushkar death probe case.

సునంద కేసులో పాక్ జర్నలిస్ట్

Posted: 03/12/2015 04:08 PM IST
Delhi police said that they may question pakistani journalist mehr tarar

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్  ఎంపీ శశిథరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో  పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ను  విచారించనున్నట్లు ఢిల్లీ పోలీస్  కమీషనర్ తెలిపారు. సునంద గత ఏడాది జనవరి 17 న  ఢిల్లీలోని ఒక హోటల్ లో అనుమానాస్పదంగా మృతి చెందింది. చనిపోవడానికి ముందు ఆమె విలేకరుల సమావేశం పెట్టాలనుకున్నారన్న సమాచారంతో ఇప్పటికే  కొంతమంది జర్నలిస్టులను ఢిల్లీ  పోలీసులు విచారించారు . ఈ కేసులో  పాకిస్తాన్ జర్నలిస్టు మెహర్ తరార్ కీలక వ్యక్తిగా భావిస్తున్నఢిల్లీ పోలీసులు అవసరమైతే, ఆమెనూ  ప్రశ్నిస్తామని గతంలోనే ప్రకటించారు. దీనిపై తరార్ స్పందిస్తూ విచారణకు తాను సిద్ధమని, కానీ, తాను భారత్ రానని, పోలీసులే లాహోర్ రావాలన్నారు.  సునందతో ట్విట్టర్ లో  ఘర్షణ పడి పెద్ద తప్పు చేశానన్నారు.  కాగా తన భర్త శశిథరూర్‌కు , మెహర్ తరార్‌తో సంబంధం ఉందంటూ తరార్ తో ట్విట్టర్ లో సునంద ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తరార్ ను విచారించేందుకు పోలీసులు నిర్ణయించారు. మొత్తానికి సునంద పుష్కర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కాగా తన భార్య మృతి పై మీడియా వార్తలు మితిమీరుతున్నాయని, పోలీసుల విచారణ సందర్భంగా తాను భయపడినట్లు వస్తున్న వార్తలను థరూర్ ఖండించారు. అందుకు కౌంటర్ గా తన ట్విట్టర్ ఖాతాలో మీడియాపై సెటైర్లు కూడా వేశారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందో, దానిపై మీడియా ఎలా స్పందింస్తుందొ చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mehr Tarar  Sunanda Pushkar  Delhi police  Pakistani journalist  

Other Articles