బంగారానికి భారత్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ఎంతో విలువుంది. అయితే చైనా, భారత్ లో మాత్రం అన్ని దేశాల కన్నా ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే దీన్ని కొందరు వ్యక్తులు వ్యాపారం కింద మార్చుకుంటున్నారు. విదేశాలలో దొరికే బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా దేశానికి తరలిస్తున్నారు. అయితే ఇలా దేశానిిక తరలించే క్రమంలో విమానాశ్రయాల్లో, కస్టమ్స్ అధికారులకు దొరికిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 58 తులాల బంగారాన్ని పట్టుకున్నారు. ఓమన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం మస్కట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ప్రయాణికులను అధికారులు తనిఖీ చేయడంతో ఓ ప్రయాణికుని నుంచి 584 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో నిన్న కస్టమ్స్ అధికారులు 9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఒక ప్రయాణికుడు 9 కిలోల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో ఒక బ్యాగులో స్పైస్ జెట్ విమానంలో సీటు కింద పెట్టి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీలో ఈ బంగారం బయటపడిందని, అన్ని కోణాలలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మార్చిలో దాదాపు 20 కిలోల బంగారాన్ని ఎయిర్ పోర్టు అధికారులు పట్టుకున్నారంటే, సంవత్సరానికి ఎన్ని కిలోల బంగారం వస్తుందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల నిర్లక్ష్యమా, స్మగ్లర్లు రెచ్చిపోతున్నారా అనే సందేహం వస్తుంది. ఇంతలా అధికారులు తనిఖీలు చేస్తున్నా, అరకొరగానే బంగారం రవాణాను అడ్డుకుంటున్నారన్నది విమర్శ. మరి భారత ప్రభుత్వం ఎప్పటికి స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more