ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం 33,252 ఎకరాలు కేటాయించిందని ఇందుకోసం ఇప్పటికే 87 శాతం మంది రైతులు భూ సేకరణకు అంగీకరించారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ప్రస్తుతం ఏడువేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందన్నారు. రానున్న మూడేళ్ల కాలంలో అభివృద్ధి చేసిన భూమిని రైతులకు అప్పగిస్తామని యనమల తెలిపారు. అలాగే రైతులకు పరిహారం చెల్లించడానికి సీఆర్డీఏకు నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. రాజధాని నిర్మాణానికి 3 వేల 168 కోట్ల రూపాయలను తన బడ్జెట్ లో కేటాయించారు.
ప్రస్తుతం పన్నుల ద్వారా సమకూరే ఆదాయం.. జీతాలు, రోజువారీ ఖర్చులకే సరిపోతోందని యనమల అన్నారు. 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్కున్న ప్రత్యేక సమస్యల్ని పట్టించుకోలేదని ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మిగిలిన రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు జరిపారని, ఇవి రాష్ట్ర ప్రగతికి దోహదపడే స్థాయిలో లేవని యనమల అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన, విభజన తీరుతో రాష్ట్రం సంక్లిష్టంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ మిగులు నుంచి లోటు రాష్ట్రంగా మారిందని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రుణభారం మరింత పెరుగుతుందని యనమల సూచించారు.
కాగా బడ్జెట్ లో విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులకు 2015-16 వార్షిక ఆర్థిక బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించారు యనమల. అలాగే గోదావరి పుష్కరాలకు రూ.200 కోట్లు కేటాయింపులు చేసింది. రెండోదశ రుణమాఫీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని యనమల రామకృష్ణుడు తెలిపారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. సాగునీరు, వరద నియంత్రణకు రూ.5,258 కోట్లు కేటాయించారు. గ్రామీణ నీటి సరఫరా రూ. 881 కోట్లు, పంచాయతీ రాజ్ రూ.3296 కోట్లు కేటాయించినట్టు ఆర్థికమంత్రి యనమల ప్రకటించారు.
ఇక అన్ని వర్గాల ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో వున్న యనమల.. తన ఆర్థిక బడ్జెట్ 2015-16 బడ్జెట్ లో కాపుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించారు. బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.37 కోట్లు, పోలీస్ సంక్షేమానికి రూ.40 కోట్లు, వికలాంగులకు రూ.81 కోట్లు కేటాయించనున్నట్టు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. ఎస్సీలకు 60 శాతం సబ్సీడీతో రుణాలు ఇవ్వనున్నట్టు తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more