తెలంగాణ సర్కార్ రైతన్న నడ్డివిరుస్తోంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా రైతుల నుండి ముక్కుపిండి వ్యాట్ రూపంలో పన్ను వసూల్ చేస్తోంది. ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియక, అసలే అటకెక్కిన వ్యవసాయానికి తెలంగాణ సర్కార్ మరింత కుంగదీస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో చేస్తున్న బిందు సేద్య పరికరాల సబ్సీడిలో రైతుకు వ్యాట్ రూపంలో కొత్త కొరివి అంటగట్టింది. ఆపసోపాల మధ్య నడుస్తున్న రైతన్నలకు సహాకరించాల్సిన తెలంగాణ సర్కార్ ఇలా వారికి పన్ను పోటు పెట్టడాన్ని రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అందరి కష్టాలు తీరతాయని అనుకుంటే, పరిస్థితి తిరగబడిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆదుకుంటుందని అనుకున్న ప్రభుత్వం రైతులకు ఇచ్చే సబ్సిడీపై చేతులెత్తేసింది.
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రిప్ ఇరిగేషన్ ఫలితాలు అనుకున్న స్థాయిలో రావడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా నీటి ఎద్దడి ఉంటోంది. అందుకు గాను తీవ్రంగా నీటి కొరత ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో సూక్ష్మసేద్యానికి ఎంతో అనువుగా ఉంటుంది. అయితే ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతాంగం డ్రిప్ ఇరిగేషన్ గురించి అవగాహన పెంచుకుంటోంది. అయితే అంతలోనే తెలంగాణ సర్కార్ వారి ఆశలకు కళ్లెం వేస్తోంది. డ్రిప్ ఇరిగేషన్ కోసం ఇస్తున్న పరికరాల్లో కేంద్రం వాటా పోను, కొంత రాష్ట్ర ప్రభుత్వం భరించేది. అయితే అందులో వ్యాట్ కూడా ఉండేది. తాజాగా వ్యాట్ భారాన్ని భరించడానికి తెలంగాణ సర్కార్ ముందుకు రాలేదు. దాంతో ఆ భారం రైతులపై పడుతోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా డ్రిప్ పరికరాలను ఇస్తున్నాహెక్టారుకు 5 వేల చొప్పున రైతులు వ్యాట్ చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాది పదిహేను వేల మందికి పరికరాలను మంజూరు చేశారు. అందులో దాదాపు పదకొండు వేల మంది రైతులు ఇప్పటికే వ్యాట్ చెల్లించారని సమాచారం. అలా మొత్తం పది కోట్లకుపైగా వ్యాట్ చెల్లించినట్లు వివరాలు నమోదయ్యాయి. ఇలా అసలే అంతంత మాత్రం నడుస్తున్న వ్యవసాయానికి కూడా మొండిచేయిస్తే, భవిష్యత్తులో తెలంగాణలో తీవ్ర ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది. వ్యవసాయం పై ఆధారపడి ఎంతో మంది జీవనోపాధిని సాగిస్తున్నారు. వ్యాట్ భారం వారి జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి తెలంగాణ సర్కార్ రైతులకు బాసటగా నిలవాలని రైతులు కోరుతున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more