పెళ్లి ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ మధురమైన రోజు. తమ జీవిత భాగస్వామితో పంచుకునే తొలి రోజు అనుభూతులు జీవితాంతం నిలిచేలా చేస్తాయి. ఆ మధుర సృతులను అప్పుడప్పుడూ గుర్తు చేసుకునేలా కొన్ని చిలిపి చేష్టలు, కోన్ని మొండి చేష్టలు వుంటాయి. ఇక ఆ రోజు రాత్రి అంటే.. ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేం. ఆ రోజు ప్రతి సెకను ఆస్వాదిస్తారు. కొత్త దంపతులు కోటి కలలతో అడుగులు వేస్తారు. ఒకరికొకరు దరిచేరలేనంత సిగ్గు.. అయితే వాటికి భిన్నంగా పెళ్లి రోజు రాత్రి వరుడి ఇంట్లోంచి పారిపోయిన ఓ వధువు అ మరుసటి రోజున వరుడికి ఓ విచిత్రమైన గిఫ్ట్ ఇచ్చింది. అదేంటనుకుంటున్నారా..?
అదే విడాకులు. పెళ్లి రోజు రాత్రి ఇంట్లోంచి వెళ్లిన వధువు మరుసటి రోజున వరుడికి విడాకులు పంపింది. ఇదేం పోయేకాలం.. ఒక్క రాత్రిలో అతగాడి గురించి ఆమెకు ఎం తెలిసింది.. ఎందుకలా విడాకులిచ్చిందో మీరే చదవండీ.. పెళ్లి రోజు రాత్రి అనుభూతలను పంచుకోవాల్సిన మధుర క్షణాలు గాలికొదిలేసి ఓ కొత్త పెళ్లికొడుకు తన భార్యను పెళ్లయిన రాత్రే చావుదెబ్బలు కొట్టాడు. ఎంతలా అంటే దెబ్బలు తిన్న ఆ అమ్మాయి పారిపోయి ఏకంగా విడాకుల నోటీసు కూడా పంపించింది. అయితే ఈ ఘటన దుర్హామ్లో చోటుచేసుకుంది.
అమీ డాసన్ (22 ) అనే యువతి, గావిన్ గోలిట్లీ (29) అనే యువకుడిపై మనసుపడి పెళ్లి చేసుకుంది. తన వెడ్డింగ్ గౌను మార్చుకోడానికి ఇబ్బంది అవడంతో.. కాస్త సాయం చేయమంది.. అంతే ఆ మాట విన్న అతడు ఇష్టం వచ్చినట్లు ఆమెపై పిడిగుద్దులు గుప్పించాడు. దాంతో ఆ అమ్మాయి బతుకు జీవుడా అంటూ అర్ధరాత్రి పారిపోయి అతగాడిని కోర్టుకు ఈడ్చింది. తనకు డ్రగ్స్ అలవాటు ఉందని, వాటి ప్రభావం వల్లే నియంత్రణ కోల్పోయి అలా ప్రవర్తించానని సదరు కొత్త పెళ్లికొడుకు కోర్టులో లబోదిబోమన్నా ఫలితం లేకపోయింది. రెండేళ్లపాటు సామాజిక సేవ చేయాల్సిందిగా కోర్టు అతడిని ఆదేశించింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more