తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మోదీపై తన వైఖరిని మార్చుకున్నట్లున్నారు. ఎన్నికల సమయంలో మోదిపై విమర్శలు చేసిన కెసిఆర్..ఇప్పుడు మాత్రం మోదీ మనోడే అంటూ అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాడు. నరేంద్ర మోది మన పక్షానే ఉన్నాడు అన్న కెసిఆర్, నీతి ఆయోగ్ పై నిర్వహించిన సమావేశంలోనూ ప్రశంసలు కురిపించారు. మొత్తానికి ఎన్నికల ముందు తిట్టిన మోదీనే ఇప్పుడు ఆకాశానికెత్తుతున్నారు కెసిఆర్. అప్పుడు అలా అంటే ఇప్పుడు ఇలా అంటున్నా అంటున్నారు మరి. మోదీ పాలన ఎంతో పారదర్శకంగా సాగుతోందని, నీతి ఆయోగ్ ఏర్పాటు ద్వారా రాష్ట్రాలకు మరింత బలం వస్తుందని, ఈ ఆలోచన చేసిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
తాజాగా నరేంద్రమోదీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పైనా ప్రకటన చేశారు. నెలలో ప్రతి మొదటి,మూడో శనివారాలలో స్వచ్చ భారత్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాలు, విద్యాలయాలు ఇలా అన్ని చోట్లా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కోసం గత ఏడాది అక్టోబర్ రెండున పిలుపునిస్తే, కెసిఆర్ అప్పుడు ఒక్క మాటైనా అనలేదు. కానీ ఇప్పుడు మాత్రం అధికారులతో స్వచ్ఛ భారత్ ను పాటించాలని కోరడం విశేషం. మొత్తానికి ప్రధాని మోదీపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్. అయితే ఎందుకు ఇలాంటి మార్పులు వచ్చాయో అందరికి తెలుసు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more