కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఏడాది బాలీవుడ్ తారలతో పాటు, ఆత్యాత్మిక గురువులు, రాజకీయ కురువృద్దులకు దేశ అత్యున్నత పౌర పురస్కారాలను అందించాలని నిర్ణయించింది. మొత్తంగా 148 మందికి దేశ అత్యున్నత పురస్కారాలను అందించాలని నిర్ణయించిన కేంద్రం వారి జాబితాను వెల్లడిందింది. ఈ ఏటి పురస్కార గ్రహీతల్లో బీజేపి అగ్రనేత ఎల్కే అద్వానీ, శిరోమణి అకాళిదళ్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాస్ సింగ్ బాదల్ సహా బీజేపికి మద్దతుగా ప్రచారం చేసిన హర్యానా బ్రాండ్ అంబాసిడర్ యోగా గురు బాబా రాందేవ్లతో పాటు మరో ఆద్యాత్మిక గురువు పండిత్ రవిశంకర్ ప్రసాద్ లు వున్నారు.
వీరితో పాటు సినీ కళామతల్లి బిడ్డలైన బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, దివంగత నటుడు ప్రాన్, నటుడు దిలిప్ కుమార్, దర్శకులు సంజయ్ లీలా భన్సాలీ, సార్వత్రిక ఎన్నికలలో బీజేపి ప్రచారానికి పాటలను రాసిన సినీ పాటల రచయిత ప్రసూన్ జోషి, సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు ఆర్థిక వేత్తలు బిబేక్ డిబ్రాయ్, జర్నలిస్టులు, రజత్ శర్మ, స్వపన్ దాస్ గుప్తా, హరిశంకర్ వ్యాస్ లతో పాటు క్రీడా రంగానికి చెందిన పివీ సింధూ, భారత్ హాకీ టీమ్ క్యాప్టన్ సార్థార సింగ్, చెక్ గ్రాండ్ మాస్టర్ శశికిరన్ కృష్ణన్, వెస్లింగ్ చాంప్ సుశీల్ కుమార్, అయన గురువు సప్తల్, సహా ఎవరెస్టు పర్వత శిఖారాన్ని అధిరోహించిన తొలి మహిళ అరునిమా సిన్హాలకు పద్మ అవార్డులను అందించనున్నారు. వీరితో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మొత్తం 148 మంది ప్రముఖులకు పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more