మాయదారి రోగం ఎక్కడికెళ్లిన తన పని తాను చేస్తూనే వుంది. అదేంటి అంటరా..? శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో కొంచె ఖరీదైన ఫోన్ వుంటే చాలు అదే యావత్ ప్రపంచాన్ని మనకు గుప్పిట్లో పెట్టినట్లే. అయితే అందివచ్చిన ఈ మార్పులు మనిషి మనోవికాసానికి దోహదపడటంలో తప్పులేదు.. కానీ. వాటిని కూడా తన వక్రబుద్దితో తప్పుడు పనులకు వినియోగిస్తేనే తప్పు. అంతేకాదు నేరం కూడా. ఈ తరుణంలో సోషల్ మీడియాతో ప్రభుత్వాలు ఏర్పడతాయని, నిలబడతాయని కూడా రుజువైంది. భారత ప్రధాని నరేంద్రమోడీ సోషల్ మీడియాను వినియోగించుకుని ముప్పై ఏళ్ల తరువాత మూడింట రెండోంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే సోషల్ మీడియాలోని షేస్ బుక్ ఇన్నాళ్లు అభ్యంతకర ఫోస్టింగ్లలకు కేంద్రంగా మారింది. క్రమంగా వాటిపై చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు ఆ మాయదారి రోగం వాట్సఫ్ కు సోకింది. తాజాగా ఓ మతానికి సంబంధించి వాట్సప్ లో అభ్యంతరకర సందేశాలు పంపడంతో ఉత్తర్ ప్రదేశ్ లోని నాన్పరా ప్రాంతంలో పలు వర్గాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకోంది. సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడంతో ఇరు వర్గాలు శాంతించాయి.
వివరాల్లోకి వెళ్తే..రాజేష్ రస్తోగి అనే వ్యక్తి తన మొబైల్ అప్లికేషన్ వాట్సప్ నుంచి మతానికి సంబంధించిన మెస్సెజ్ లను పదే పదే పంపుతున్నాడు. ఈ సందేశాలతో నాన్పురాలో కలకలం రేగడంతో పాటు, కొన్ని వర్గాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్ ను అరెస్ట్ చేశారు. మతానికి తప్పుడు ప్రచారం చేస్తున్నకారణంగా అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ ఆర్.ఎల్ వర్మ తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more