యమునా నది, ప్రపంచ ఏడో వింతైన తాజ్ మహల్ అందాలను ఒకనాడు తనలో చూసుకుంటూ మురిసిపోయే నది. అంతేకాదు సాగు, తాగు నీరుకు ఆలవాలమైన నది. అలాంటి నది ఇప్పుడు కంపుకొడుతూ.. పర్యావరణానికి సవాల్ విసరుతోంది. గంగా యమునా నదుల ప్రక్షాళన చేసి నదీ జలాలను కలుషితం కాకుండా చేసేందుకు, నాటి వైభవాన్ని తిరిగి సంతరించుకునేలా.. ప్రభుత్వం గత కొన్ని ఏళ్లుగా చేపడుతున్న కార్యక్రమాలు సానుకూలమై ఫలితాన్ని ఇవ్వడం లేదు. ప్రభుత్వాలు మారినా.. నదీజలాల కాలుష్యం మాత్రం తరగడం లేదు.
కాగా, ఈ పరిస్థితిని మార్చేందుకు పూనుకుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్. యమునా నదిలో చెత్త, చెదారాన్ని వేయకుండా ప్రజలను నిలువరింపజేసేందుకు కొంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. యమునా నది మనది దానిని పవిత్రంగా వుంచుదామన్న ప్రచారంతో ప్రజల్లో కదిలిక కరువైంది. దీంతో మరో రకమైన ప్రచారంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కదిలింది. యమునా నదిలో చెత్త వేసే దమ్ముందా అంటూ ప్రజలలో కదిలికను తీసుకురానుంది. దీనిని విస్తారంగా ప్రచారం చేయడంతో స్థానికులు కూడా చెత్త వేసేందుకు జంకుతారని అభిప్రాయానాకి వచ్చింది.
దీనికి కారణమేమిటంటే..యమునా నదిలో చెత్త చెదారం వేస్తూ పట్టుబడితే వారికి ఐదు వేల రూపాయల జరిమానా విధించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నిర్ణయించారు. ఆయన నేతృత్వంలోని ట్రిబ్యూనల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో యమునా నదిని మరో రెండేళ్లలో కాలష్య రహితంగా చేసే పథకం మైలీ సే నిర్మల్ యమునా ప్రాజెక్టు అవిష్కృతం కానుందని తెలిపారు. అంతేకాదు శిధిలాలను యమునా నదిలో వేసే వారికి 50 వేల రూపాయల జరిమానాను కూడా విధించాలని నిర్ణయించారు. ఇప్పుడు చెప్పండి మీకు యమునా నదిలో చెత్త వేసే దమ్ముందా..?
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more