తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రి వర్గ విస్తరణ తల నొప్పులు తెచ్చిపెడుతుంది. ఇప్పటికే మంత్రి వర్ణ విస్తరణ తేది ఖరారు కావటం తో ముఖ్యమంత్రి మరియు పార్టీ సీనియర్లు కలిసి విస్తరణ పై తుది కసరత్తు చేస్తునట్లు సమాచారం. కొందరి పేర్లు ఇప్పటికే అధికారికంగా ఖరారు అయ్యాయి. వారిలో ఖమ్మం నుండి తుమ్మల్ నాగేశ్వర్ రావు, మహబూబ్ నగర్ జిల్లా నుండి జూపల్లి కృష్ణ రావు, డాక్టర్ లక్ష్మ రెడ్డిల పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తుంది. గవర్నర్ నరసింహన్ కార్యాలయానికి తుది కసరత్తు పూర్తి అయిన తర్వాత అధికారికంగా జాబితాను పంపిస్తారు.
ఈ విస్తరణలోఆరుగురికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ముగ్గురి పేర్లు ఖరారు అయిన నేపథ్యం లో మరో ముగ్గురు పేర్లు కెసిఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మరో ముగ్గురిలో..., గిరిజన కోటాలో వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ ఎం.ఎల్. ఏ అజ్మీరా చందు లాల్ పేరు దాదాపు ఖాయమన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఆదిలాబాద్ నుండి ఇంద్ర కరణ్ రెడ్డి పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
హైదరాబాద్ కి చెందిన వలస నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తీవ్రంగా చర్చ నడుస్తునట్లు సమాచారం. టి.డి.పి నుండి హామీ పై తెరాస లోకి వచ్చిన తలసాని పేరు కూడా మంత్రి పదవి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో నగరం లో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా తలసాని కి పేరు ఉండటం తో తలసాని పేరు పై తీవ్ర చర్చ నడుస్తుంది.
మహిళా ఎం.ఎల్. ఏ లలో కొండ సురేఖ పేరు తీవ్రంగా వినిపిస్తుంది. తెరాస పార్టీ లో ఇతర సీనియర్ మహిళా ఎం.ఎల్. ఏ లు ఉన్నప్పటికీ, సురేఖ సీనియర్ కావటం తో ఆమెకు దాదాపుగా ఖాయమని ప్రచారం జరుగుతుంది.
ఇవన్ని పక్కన పెడితే ఇప్పటికే అసంతృప్తులు భగ్గుమంటున్నారు. సీనియర్ ఎం.ఎల్. ఏ కొప్పుల ఈశ్వర్ కి చీఫ్ విప్ పదవి ఇవ్వటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి తో సమావేశం అయి తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయనకు కెసిఆర్ నుండి వ్యక్తిగతంగా కాల్ వెళ్ళినట్లు చెప్తున్నారు. ఇతర నేతలు గంప గోవర్దన్ మరియు శ్రీనివాస్ గౌడ్ కూడా తమకు పార్లమెంటరీ కార్యదర్శి హోదా ఇవ్వటం పై కొంత నిరాశ తో ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికే ఈ అసంతృప్తులు పార్టీ కి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించటం గమనార్హం.
హరి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more