సరిగ్గా అయిదు సంవత్సరాల క్రితం ఐ టి రంగాన్ని బెంబేలేత్తించిన సత్యం కుంభకోణం పై ఎట్టకేలకు న్యాయస్థానం తీర్పు వ్యవహరించింది. 2009 సంవత్సరంలో వెలుగు చుసిన ఈ కుంభకోణంలో మొత్తం ఏడు రకాల కేసు లను దాఖలు చేయగా ఒక కేసు ని కొట్టి వేయగా ఆరు కేసులకు సంబంధించిన తీర్పు ను ప్రత్యేక న్యాయస్థానం వెలువరించింది.
సత్యం కుంభకోణం లో ప్రధాన నిందితులైన రామలింగ రాజు, రామరాజు లకి నాలుగు కేసు లలో ఒక్కో దానికి 6 నెలల జైలు శిక్ష విధించగా .., అయిదు కేసు లలో ఒక్కో దానికి 10 లక్షల జరిమానా విధించింది. మరో నిందితుడైన రామ్ మైనంపాటికి 3 కేసులలో 6 నెలల చొప్పున జైలు శిక్ష ఒక్కో దానికి 10 లక్షల జరిమానా విధించింది. తీర్పు పై అప్పీలు చేసుకునేందుకు నెల పాటు గడువిచ్చింది. ఇతర నిందితులైన సత్యం మాజీ డైరెక్టర్లు కృష్ణ పాలెపు,, ఎన్ శ్రీనివాస్, వినోద్ కే ధామ్, టీ ఆర్ ప్రసాద్ లకు ఒక్కొకరికి ఇరవై వేల చొప్పున జరిమానా విధించింది.
వడ్లమాని శ్రీనివాస్ కి మూడు కేసు లలో ఆరు నెలల చొప్పున జరిమానా విధించింది. దేశంలో ఒక సంచలనాన్ని సృష్టించిన ఈ కుంభకోణం పై మొట్ట మొదట సి బి ఐ దర్యాప్తు చేపట్టినప్పటికీ ఎన్నో పరిణామాల తర్వతా చిట్ట చివరకు ఆర్ధిక నేరాల ప్రత్యేక కోర్ట్ లో ఈ కేసు విచారణ సాగి ఇప్పటికీ తీర్పు వెలువరించింది.
హరికాంత్ రామిడి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more