తన భర్త మూడో పెళ్లి చేసుకున్నాడని తెలిసిన ఆ భార్య అతనికి తగిన శాస్తి చేసింది. రాజేంద్ర నగర్ బండ్లగూడలో నివాసముంటున్న సెక్రటేరియేట్లో ఉద్యోగి మహేష్ తొలుత పద్మను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. వివాహమైన కోన్నాళ్లు భార్య పద్మతో ఉండకుండా వికారాబాద్లో తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేశాడు. కుటుంబ కలహాలు సర్దుకున్నాక మళ్లీ వస్తాడనుకుని పద్మ తన ఇద్దరి పిల్లలతో అక్కడ నివసించింది. ఈలోగా పద్మకు మరో పిడుగు లాంటి వార్త అందింది.
తనకు తెలియకుండా మహేష్ మరో వివాహం చేసుకున్నాడని తెలిపింది. తాను బతికి వుండగానే, తన అనుమతి లేకుండా భర్త రెండో పెళ్లి చేసుకోవడంపై మండిపడింది. తనను ఎందుకు అన్యాయం చేస్తున్నావని విలపించకుండా.. తన అనుమతి లేకుండా ఎలా రెండో పెళ్లి చేసుకుంటావని భర్తను నిలదీసింది. భర్తతో పాటు అతని అత్తా, మామలను కూడా ప్రశ్నించింది. పద్మ బంధువులు కూడా వారిని నిలదీశారు. ఈ పెళ్లి ఎలా చెల్లుతుందని వారు ప్రశ్నించారు. తాము న్యాయం కోసం పోరాడుతామని చెప్పండంతో భర్తతో పాటు అతని తల్లిదండ్రలు వారిని శాంతింపజేశారు. గొడవ చూసి మహేష్ రెండవ భార్య అతనిని వదిలి వెళ్లిపోయింది.
కుక్క తోక ంక వంకరా అన్నట్లు కొన్నాళ్ల పాటు నమ్మకుండిన మహేష్ పద్మకు తెలియకుండా మూడవ పెళ్లి చేసుకున్నాడు. జ్యోతి అనే యువతిని మూడవ పెళ్లి చేసుకున్నడన్న సమాచారం తెలుసుకున్న మొదటి భార్య పద్మ.. తన భర్త జ్యోతితో కలసి రాజేంద్ర నగర్ బండ్లగూడలో నివాసముంటున్నాడని కూడా తెలుసుకుంది. వారిద్దరూ వున్న సమయంలో భర్త ఇంటికి పిల్లలు, బంధువులను తీసుకొని వచ్చి భర్త మహేష్ కు దేహశుద్ధి చేసింది. వెంట వచ్చిన బంధువులు కూడా మహేష్కు నాలుగు తగిలించారు. మహేష్పై రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more