అమెరికాలో చదువు కోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. పాస్ పోర్ట్ రావటంతోనే యునివర్సిటీల్లో సీటు వచ్చినంతగా సంతోషపడతారు. ఇక అగ్రరాజ్యంలోని యునివర్సిటీల్లో సీట్లు వస్తే.., మనవారి ఆనందానికి అవధులుండవు. తమ జీవితం త్వరలో సెటిల్ అవుతుందని అంతా ధీమాగా ఉంటారు. ఎందుకంటే అక్కడి చదువులకు అంత ప్రాముఖ్యత ఉంది. ఈ గుడ్ విల్ ఉపయోగించి ఓ మహిళ దొంగ యునివర్సిటీ తెరిచింది. అడ్మిషన్ కోసం ఆశగా ఎదురుచూసిన విద్యార్థులు ముందు వెనకా ఆలోచించకుండా జాయిన్ అయ్యారు. అలా వందల మంది భారతీయులు మోసపోయారు. చివరకు వర్సిటి బోగస్ అని తేల్చిన అగ్రరాజ్యం విచారణ చేపట్టి నిర్వాహకురాలిని కటకటాల వెనక్కి నెట్టింది. కేసును విచారించిన కోర్టు.., కారకురాలికి 16ఏళ్ళకు పైగా జైలు శిక్ష విధించింది. ఇదంతా అమెరికాలో సంచలనం రేపిన.. వందలమంది భారతీయ విద్యార్థుల జీవితాల్ని నాశనం చేసిన ట్రై వ్యాలి యునివర్సిటీ గురించి.
విద్య పేరుతో విద్యార్థుల్ని మోసం చేశారు
అమెరికా చదువుకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించిన సూసన్ జియావో పింగ్ అనే మహిళ కాలిఫోర్నియాలో 2008లో ఓ బోగస్ యునివర్సిటీ తెరిచింది. ఓ చోట కార్యాలయం ఏర్పాటు చేసుకుని.. ట్రై వ్యాలి పేరుతో వెబ్ సైట్ నడిపింది. ఇంజనీరింగ్, బిజినెస్, న్యాయ, వైద్య శాస్ర్తాల్లో డిగ్రీలు అందిస్తున్నట్లు వెబ్ సైట్ ద్వారా ప్రకటించింది. అంతేకాకుండ బండారం బయట పడకూడదనే ఉద్దేశ్యంతో ఆన్ లైన్ కోర్సులు, క్లాసులు అని చెప్పకుంది. దీంతో విద్యార్థులు రోజూ వర్సిటికి వచ్చే అవసరం ఉండదు. యూఎస్ చదువు కోసం ఎదురుచూస్తున్న చాలామంది విద్యార్థులు ఈ వర్సిటి నిజంగా ఉందనుకుని దరఖాస్తు చేశారు. అడ్మీషన్లు రావటంతో అంతా సంతోషపడ్డారు. ఇక తమ లైఫ్ సెటిల్ అయిపోయిందని కలలుగన్నారు.
ఈ యునివర్సిటీలో సీట్లు పొందిన విద్యార్థుల్లో 90శాతం మంది భారతీయులే ఉన్నారు. ఉన్నత చదువుల కోసమని ఒక్కొక్కరూ సెమిస్టర్ కు దాదాపు లక్షా అరవై ఆరు వేల రూపాయలు ఫీజుగా చెల్లించారు. ఒక యునివర్సిటీ ప్రారంభించినప్పుడు కేవలం 11మంది విద్యార్థులే ఉండగా.., 2010 డిసెంబర్ కు ఈ సంఖ్య అమాంతం 1500 దాటింది. నకిలి పత్రాలతో ఎఫ్ -1 వీసాలు, సర్టిఫికెట్లు సృష్టించి విద్యార్థులకు ఇచ్చింది. ఇంకో విషయం ఏమిటంటే వర్సిటీలో అడ్మీషన్ పొందినవారు ఇతర విద్యార్థులను చేర్పిస్తే కమీషన్లు ఇస్తామని ప్రలోభ పెట్టింది. అలా చాలామంది విద్యార్థులను చేర్పించి పరోక్షంగా వారి జీవితాలను నిండా ముంచేశారు. ఇక హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో కన్సల్టెన్సిల ద్వారా విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చింది. ఇందుకోసం విద్యార్థులు భారీగా డబ్బులు చెల్లించటం జరిగింది.
గుట్టురట్టు చేసిన కస్టమ్స్
ఇలా మూడేళ్ళపాటు ఈ బోగస్ యునివర్సిటీ కొనసాగింది. చదువు పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్లు కూడా ఇచ్చింది. అయితే వర్సిటీ జారీ చేసిన వీసాలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ తనిఖీ చేయగా.., బాగోతం బయటపడింది. అసలు ఈ యునివర్సిటికి అనుమతి లేదని ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ తేల్చింది. వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వగా.., రంగంలోకి దిగిన ప్రత్యేక విచారణ బృందాలు ఈ యునివర్సిటీ బోగస్ అని ప్రకటించాయి. అక్రమాలపై విచారణ మొదలు పెట్టాయి. దీంతో తామంతా మోసపోయామని విద్యార్థులు గుర్తించారు. అటు ఈ ఉదంతంతో అమెరికా షాక్ అయ్యింది. అగ్రరాజ్యంగా పేరుపొందిన తమ దేశంలో ఇలా చదువు పేరుతో కుంభకోణం జరగటంను తీవ్రంగా పరిగణించింది.
ప్రభుత్వ ఆదేశాలతో కేసు విచారణ చేపట్టిన ప్రత్యేక బృందాలు యునివర్సిటీలో చదివే విద్యార్థులను విచారించింది. అంతేకాకుండా వర్సిటీలో పనిచేస్తున్న పలువురు భారతీయులను అరెస్టు చేసింది. కొందరిపై నిఘా పేరుతో కదలికలను గమనించేందుకు కాళ్ళకు ప్రత్యేక ఎలక్ర్టానిక్ పరికరాలు అమర్చింది. సాధారణంగా ఇవి నేరస్తుల కదలికలను గమనించేందుకు అమరుస్తారు. అయితే వీటిని విద్యార్థులకు బిగించటంపై భారత్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. విదేశాల్లో చదువు కోసం వచ్చిన విద్యార్థులను ఇలాగే అవమానిస్తారా అంటూ విమర్శలు వచ్చాయి.
తెలుగువారికీ ప్రమేయం
ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన ధర్యాప్తు బృందాలు, యునివర్సిటీ పత్రాలు, బోగస్ డాక్యుమెంట్లు, వీసాలు, ఇతర కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 2011 మే 2న ఈ కుంభకోణం కారకురాలు సుసాన్ ను అరెస్టు చేశారు. ఆమెను విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయ విద్యార్థులను చేర్చుకునేందుకు ఉపయోగించిన అక్రమ మార్గాలు, వీసా జారీలో చేసిన మోసాలు, ఇందుకు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో సహకరించిన వ్యక్తుల పేర్లు బయటకు వచ్చాయి. సూసాన్ ఇచ్చిన సమాచారం ప్రకారం 2011 అక్టోబర్ లో నలుగురు భారతీయులను అరెస్టు చేయటం జరిగింది. వీరందరిపై మోసం, వీసా ఫోర్జరీ, తప్పుడు దృవీకరణ పత్రాలు ఇతర అభియోగాలపై కేసులు నమోదయ్యాయి.
అటు కేసు విచారణ చేపట్టిన అమెరికా కోర్టు.., యునివర్సిటీ పేరుతో జరిగిన మోసాలను నిర్ధారించింది. ధర్యాప్తు సంస్థలు తాము సేకరించిన ఆధారాలను కోర్టుకు సమర్పించాయి. అటు న్యాయవాదులు యునివర్సిటీ పేరుతో సూసన్ అక్రమంగా రూ.5.9 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు కోర్టకు తెలిపారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం సూసన్ ఇమ్మిగ్రేషన్, మోసం, ఫోర్జరీ, మనీ లాండరింగ్ సహా ఇతర నేరాలకు పాల్పడిందని దృవీకరించింది. ఈ నేరాలకు గాను సూసన్ జియావో పింగ్ కు 16సం. జైలు శిక్షతో పాటు 9లక్షల డాలర్ల పరిహారం ప్రకటించాలని తీర్పు చెప్పింది. అంతేకాకుండా అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొన్న కార్లు, భవనాలు, ఇతర స్థిర, చర్ ఆస్తులన్నిటినీ జప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
విద్య పేరుతో మోసం చేసే వారికి ఇది తగిన గుణపాఠంగా నిలుస్తుంది. అటు అమెరికాలో చదువు అనే కారణంతో ముందు వెనకా చూడకుండా చేరి మోసపోతున్న వారికి ఈ యునివర్సిటీ ఓ హెచ్చరిక అవుతుంది. నేరం చేసిన వారికి శిక్ష పడటం సంతోషకరమే. కాని వందల మంది విద్యార్థుల జీవితాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. లక్షల రూపాయలు చెల్లించి పొందిన డిగ్రీలు ఎందుకూ పనికిరాని చిత్తు కాగితాలు అయ్యాయి. కాబట్టి ఇప్పటికైనా విద్యార్థులు అమెరికా అనగానే ఆవేశపడకుండా, ముందు వెనకా ఆలోచిస్తే మంచిది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more