సచిన్ టెండుల్కర్ మాస్టర్ బ్యాట్స్ మన్ గా..., క్రికెట్ దిగ్గజంగా మాత్రమే మనకు తెలుసు. కానీ ఆయనలోనూ ఓ రొమాంటి్క్ లవర్ బాయ్ ఉన్నాడనే సంగతి అంజలి చెప్తే కాని తెలియలేదు. భర్తతో తన ప్రేమాయణం గురించి తొలిసారి ఆమె మాట్లాడింది. సచిన్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ పుస్తకావిష్కరణ సభలో ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సచిన్ ను తాను మొదటగా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చూసినట్లు చెప్పింది. అప్పుడు అబ్బాయిగారికి బహుశా 17 సంవత్సరాలు ఉంటాయని వెల్లడించింది.
తొలి చూపులోనే మాస్టర్ పై మనసు పారేసుకున్నట్లుగా అయి... కుర్రాడు ఎవరో బాగున్నాడు అని తన స్నేహితురాలికి చెప్పానంది. అంతేకాకుండా ఎందుకు వదిలి పెట్టాలి అన్నట్లుగా వెంటనే వెళ్లి, కలిసి మాట్లాడానంది. అలా తన పరిచయం, స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా.., చెరిగిపోని ధృడమైన బంధంగా మారిందని వివరించింది. ఇంకో విషయం ఏమిటంటే... ప్రేమలో మునిగితేలిన సమయంలో తాను సచిన్ కు ప్రేమ లేఖలు కూడా రాశానని చెప్పింది. అంజలి తన ప్రేమ గురించి మీడియాతో మాట్లాడటం ఇదే తొలిసారి కావటం విశేషం.
ఇక ఇదే కార్యక్రమంలో భార్య అంజలిని టెండుల్కర్ పొగడ్తలతో ముంచెత్తారు. క్రికెటర్ భార్యగా ఉండటం సాధారణ విషయం కాదన్నారు. ప్రాక్టీస్, మ్యాచ్, విదేశీ ప్రయాణాలు అంటూ ఎప్పుడూ ఖాళీగా ఉండని వ్యక్తికి భార్యగా అంజలి తనను అర్ధం చేసుకుని నడుచుకుంది అని చెప్పారు. అంజలి లాంటి భార్య ఉండటం వల్లే తాను ఏ చింతా లేకుండా ఆటపై దృష్టి పెట్టేందుకు చాన్స్ దొరికిందని పొగిడారు. ఇక తన పుస్తకం రాసేందుకు సుమారు మూడేళ్లు పట్టిందన్నారు. ఇందుకోసం తన అన్నయ్య అజిత్ ఎంతగానో సహకరించాడని చెప్పారు.
‘ప్లేయింగ్ ఇట్ మై వే’ పుస్తకాన్ని తన అభిమానులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. తొలి పుస్తకాన్ని తన తల్లి రజినీకి ఇవ్వగా.., రెండవ కాపిని కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కు బహుమతిగా ఇచ్చాడు. ముంబైలో జరిగిన ఈ పుస్తకావిష్కరణలో గవాస్కర్, రవిశాస్త్రి, గంగూలీ, ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, హర్షబోగ్లే సహా ఇతర ప్రముఖులు వచ్చారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more