భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ తరహాలో రూపొందించిన 'ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్' ఏడు ఉపగ్రహాల వరుసలో మూడో ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టేందుకు సమాయత్తమైంది. రేపు తెల్లవారుజామున 1.32 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి 26 (పీఎస్ఎల్వీ) ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1సి ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి కౌంట్డౌన్ ప్రక్రియ షార్లో సోమవారం ఉదయం 6.32 గంటల నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. 67 గంటల పాటు కౌంట్డౌన్ ముగిసిన వెంటనే పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లనుంది.
పీఎస్ఎల్వీ-సి26 ఎక్స్ఎల్ తరహా రాకెట్ ప్రయోగాల్లో ఇది ఏడోది. పీఎస్ఎల్వీ సిరీస్లో 28వ ప్రయోగం. ఎక్స్ఎల్ తరహాలో చంద్రయాన్-1, రీశాట్-1, ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎ, బీలతోపాటు అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన మామ్ ఉపగ్రహాన్ని కూడా ఇస్రో చేపట్టింది. కౌంట్డౌన్ కార్యక్రమంలో భాగంగా రాకెట్లో ఘన, ద్రవ ఇంధనాలను నింపుతున్నారు. ఇప్పటికే పలుమార్లు వివిధ పరీక్షలు నిర్వహించారు. పీఎస్ఎల్వీ ప్రాజెక్టు డైరెక్టర్ కున్హికృష్ణన్, ఐఆర్ఎన్ఎస్ఎస్-1సి ఉపగ్రహ డైరెక్టర్ నాగేశ్వరరావు, షార్ సంచాలకులు ఎంవైఎస్ ప్రసాద్ తదితరులు కౌంట్డౌన్లో పాల్గొన్నారు.
ఆదివారం తెల్లవారుజామున నిర్వహించిన పొలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్ సీ-26 వాహన నౌకకు సంబంధించిన సన్నద్ధత ప్రయోగం సక్సెస్ అయ్యింది. దీంతో ఇక ప్రయోగానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇస్రో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ప్రయోగ సమయంలో చేసే పనులన్నింటినీ శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా నిర్వహించారు. ఉపగ్రహ ప్రయోగాలకు ముందు ఆనవాయితీగా శ్రీవారిని దర్శించుకునే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్ రాధాకృష్ణన్ ధర్శనానంతరం షార్కు చేరుకున్నారు. ఆయన ఎంసీసీకి వెళ్లి కౌంట్డౌన్ ప్రక్రియను పర్యవేక్షించారు. శాస్త్రవేత్తలను అడిగి వివరాలను తెలుసుకున్నారు. పీఎస్ఎల్వీ సి-26ను విజయవంతంగా నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నధమయ్యారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more