అమెరికాలోని ట్విన్ టవర్స్ పై దాడితో ప్రపంచాన్ని హడలెత్తించిన ఆల్ ఖయిదా తన ఉనికి చాటుకునేందుకు సిద్ధమవుతోంది. ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత తగ్గుముఖం పట్టిన సంస్థ కార్యకలాపాలను మళ్ళీ విస్తరించేందుకు వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగానే భారత దేశంలో కూడా ఆల్ ఖయిదా శాఖను ప్రారంభిస్తున్నట్లు ఉగ్రవాద సంస్త ప్రస్తుత చీఫ్ ఆల్ జవహరి తెలిపారు. జవహరి ప్రసంగంతో ఈ మద్య విడుదలైన ఓ వీడియోలో ఆయన ఈ ప్రకటన చేశారు.
దేశంలో అన్యాయానికి, అణిచివేతకు గురవుతున్న ముస్లింలకు అండగా ఉండేందుకు దేశంలో శాఖను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా భారత్ లో షరియా చట్టం అమలు చేయటం.., ఆక్రమణలకు గురైన ముస్లిం భూములను తిరిగి వారికి అప్పగించటం, వివక్షకు గురవుతున్న ముస్లింల తరపున పోరాడటమే తమ లక్ష్యమని జవహరి తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాద సంస్థలో షాక్ షరియా కమిటి వ్యవహారాలు చూస్తున్న అసిమ్ ఉమర్ భారత శాఖ చీఫ్ గా ఉంటారని జవహరి చెప్పారు. తమకు ఈ శాఖ ఏర్పాటు చేసేందుకు రెండేళ్ళ సమయం పట్టిందన్నారు.
అంటే లాడెన్ మరణించిన తర్వాత బాధ్యతలు చేపట్టిన జవహరి ప్రధానంగా సంస్త విస్తరణ.., కార్యకలాపాల పరిధి పెంచటంపై దృష్టి పెట్టారని తాజా వీడియో సందేశం స్పష్టం చేస్తోంది. రెండేళ్ళ పాటు సైలెంట్ గా ఉన్నా.., గ్రౌండ్ వర్క్ చేసినట్లు ఆయన మాటల ద్వారా అర్ధం అవుతోంది. ప్రదానంగా సంస్థ పరిధిని విస్తరించేందుకు ముస్లిం యువతను ఆకర్షించేలా వారికి వ్యక్తిగత సాయం ద్వారా ఆల్ ఖయిదా వైపు ఆకర్షితులయ్యేలా వ్యూహ రచన చేస్తున్నట్లు స్సష్టమవుతోంది. దేశంలో ఇండియన్ ముజాహిదీన్ సహా ఇతర ఉగ్రవాద సంస్థలు దాడులు చేయటంతో పాటు.., భారత యువకులతోనే దేశంపై యుద్ధం చేయిస్తున్నాయి. ఈ క్రమంలో ఆల్ ఖయిదా కూడా దిగితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఆల్ ఖయిదా సహా ఇతర ఉగ్రవాద సంస్థల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టినట్లు ఇంటలిజెన్స్ అధికారులు చెప్తున్నారు. వారి వ్యూహాలను సమర్ధంగా తిప్పికొడతామన్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more