అధికార కాంగ్రెస్ పార్టీ మేధోమథన సదస్సు ఇవాళ హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రారంభం అయింది. ఈ మేథోమధన సదస్సుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, రాష్ట్ర, కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. సదస్సు ఆరంభంలోనే రసాబాసా చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ ఫోటోలు లేకపోవడం ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనే కాకుండా కేంద్రమంత్రి చిరంజీవి ఫోటోలు లేకపోవడంతో ఆయన వర్గీయులు, అభిమానులు ఆందోళనకు దిగారు. ఇటు దామోదర, అటు చిరు వర్గీయులు ఆందోళనకు దిగడంతో అక్కడ రసాభాసా ఏర్పడింది. ఇక ఈ సదస్సుకు వచ్చిన తెలంగాణ ఎంపీలకు అవమానం జరిగింది. సదస్సుకు వస్తున్న ఎంపీలకు పాసులు లేవని అడ్డుకోవడంతో వారు వేదిక ముందు బైఠాయించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
దీంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ఎంపీలను బుజ్జగించి వేదిక పైకి తీసుకు వెళ్లారు. ఎంపీ పొన్నం తెలంగాణ అమర వీరులకు సంతాపం ప్రకటించాలని చూచించగా బొత్స సమైక్య, తెలంగాణ ఉద్యమాల్లో ఎంతో మంది చనిపోయారని, వారందరికీ సదస్సు తరఫున అధ్యక్షుడిగా తాను సంతాపం తెలియజేస్తున్నానని, అందరి ఆత్మలకు శాంతి కలగాలని మౌనం పాటిద్దామన్నారు. ఇక కేంద్రమంత్రులు పురంధేశ్వరి, జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి నగరంలో ఉన్నప్పటికీ హాజరు కాలేదు. మొత్తానికి కాంగ్రెస్ మేథోమధన సదస్సు రసాభాసాగా తయారయ్యిందని అంటున్నారు అక్కడి వారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more