అది అసలు పాకిస్థాన్ కాదు..! అంటే అప్పటి పాకిస్థాన్ కాదు.. మోడీ వచ్చిన తరువాత పాకిస్థాన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పటి వరకు అలాంటి పాకిస్థాన్ ను నేను చూడలేదని భారతీయ జవాన్ సత్యశీల్ యాదవ్ చెబుతున్నారు. పాకిస్థాన్ కాస్త ..ప్రేమ దేశంగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మోడీ రాకతో.. శత్రువు దేశం కాస్త.. స్నేహ దేశంగా మారిపోయిందని పాకిస్థాన్ సైన్యం చేతిలో చిక్కిన మన ఆర్మీ జవాన్ చెబుతున్నారు.
మన జవాన్ల తలలు నరికి తీసుకెళ్లిన పాకిస్థాన్.. ఇప్పుడు మన ముందు తల వంచింది. శత్రువు దేశం జవాన్ దొరికితే.. పాకిస్థాన్ సైన్యం ఏం చేస్తుందో ప్రపంచ దేశాలకు, భారతీయులకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు పాకిస్థాన్ పూర్తిగా మారిపోయింది. అందుకు నేనే సాక్షి అంటూ.. స్వదేశానికి చేరుకున్న భారత్ జవాన్ సత్యశీల్ యాదవ్ చెప్పటం జరిగింది.
పాకిస్థాన్ దేశం తనపై చూపిన ప్రేమకు ముగ్ధుడయ్యాడు. తనను ఆ దేశ అధికారులు చాలా బాగా చూసుకున్నారని స్పష్టం చేశాడు. ప్రమాదవశాత్తూ పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించిన భారత జవాన్ ను ఆ దేశం సురక్షితంగా అప్పగించిన అనంతరం కుటుంబ సభ్యులను కలిసిన సత్యశీల్ మాట్లాడాడు. ' నన్ను పాకిస్తాన్ బాగా చూసుకుంది. నేను అనుకున్నదానికంటే ఎక్కువగా ఆ దేశం నాపట్ల అమితమైన శ్రద్ధ చూపించింది' అని తెలిపాడు. కొన్ని రోజుల క్రితం బీఎస్ ఎఫ్ జవాన్ యాదవ్ చీనాబ్ నదిలో కొట్టుకుపోయి పాకిస్థాన్ రేంజర్లకు చిక్కాడు.
జమ్మూలోని ఆర్ ఎస్ పురా సెక్టార్ లోని జీరో లైన్ వద్ద పాక్ సైనికాధికారులు సత్యశీల్ ను ఈ రోజు బీఎస్ ఎఫ్ అధికారులకు అప్పగించారు. సత్యశీల్ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాడని బీఎస్ ఎఫ్ అధికారి చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more