ఆమధ్య ఫిలిప్పీన్స్ లో ఒక చిన్నార మరణించి, తిరిగి మళ్లీ బతికిందన్న వార్తను మనం వీడియో ద్వారా కళ్లారా వీక్షించిన సంగతి తెలిసిందే! ఆ సంఘటనతో ప్రపంచం మొత్తంమీద వున్నవారందరూ ఒకేసారి షాక్ కు గురయ్యారు. ఇదెలా సాధ్యమంటూ బీపీ ట్యాబ్లెట్ల కోసం డాక్టర్లు పరుగులు తీశారు. ఆ బాలిక కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ ఆ సంతోషం కొన్ని రోజులకే పరిమితం అయింది. ఆ బాలిక తీవ్ర జ్వరంతో మరణించింది.
ఇదిలావుండగా... తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి.. రైలు నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతడు స్పృహ కోల్పోయాడు. దీంతో అక్కడున్న స్థానికులు వెంటనే అతన్ని లాతూర్ లోని ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స చేయడానికి వచ్చిన డాక్టర్లు అతడు మరణించాడు నిర్ధారించారు. శరీరంలో కదలికలు లేకుండా పూర్తిగా స్పృహ కోల్పోయిన స్థితిలో వుండటం వల్ల డాక్టర్లు ఆ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. అంతే! అతని పోస్టుమార్టం కోసం అన్ని కార్యక్రమాలు సిద్ధం చేశారు.
వైద్యులు ఆ వ్యక్తి పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని గదిలోకి తీసుకెళ్లారు. అతని పోస్టుమార్టం కోసం కేవలం కొన్ని క్షణాలు మాత్రమే వున్నాయి. అయితే ఉన్నట్లుండి ఆ బాధితుడి శరీరంలో కదిలికలు వచ్చినట్లు అక్కడే వున్న ఒక సబ్ ఇన్స్ పెక్టర్ గుర్తించి, వైద్యులకు తెలిపాడు. ‘‘ఇదెలా సాధ్యమవుతుంది..?’’ అంటూ ఆందోళనల్లో మునిగిపోయిన సదరు డాక్టర్లు... ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి దీర్ఘంగా గమనించిగా అతని శరీరం కదలికలు చేసింది. అంతే! ‘‘ఓరి నాయనోయ్.. ఇదేం మిరాకిల్ రా బాబు’’ అంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చివరికి ఆ వ్యక్తి మరణించలేదని వైద్యపరీక్షలు చేసి తాపీగా తేల్చారు. అక్కడే వున్న సబ్ ఇన్స్ పెక్టర్ ఈ విషయాన్ని గనుక గుర్తించకపోయి వుంటే ఆ వ్యక్తి మరణించడం ఖాయం!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more