తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ఎల్ అండ్ టీ షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని జరుగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మెట్రో పనులపై.. సీఎం కేసిఆర్ దృష్టిపడింది. కొన్ని కొత్త కోరికల చిట్టాను ఎల్ అండ్ టీ ముందు సీఎం కేసిఆర్ ఉంచటం జరిగింది. దీంతో ఎల్ అండ్ టీ కేసిఆర్ కోరికల చిట్టాను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నట్లు సమాచారం.
టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మేము చాలా నష్టపోవాల్సి వస్తుందని ఎల్ అండ్ టీ సంస్థ గట్టిగానే చెబుతుంది. దీంతో మెట్రో రైలు ప్రాజెక్టు నుండి తప్పుకోవటానికి సిద్దమైనట్లు సమాచారం. దీంతో, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మెట్రోకు కష్టాలు ప్రారంభమయ్యాయి. చారిత్రక, వారసత్వ కట్టడాలున్న (అసెంబ్లీ, సుల్తాన్ బజార్, బడీచౌడి, మొజాంజాహీ మార్కెట్ ...) ప్రాంతాల్లో మెట్రోను అండర్ గ్రౌండ్ లో నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీపై ఒత్తిడి తెచ్చారు. దీంతో, ఇప్పటికే పనులన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈ మెలిక పెట్టడమేమిటని ఎల్ అండ్ టీ ప్రశ్నిస్తోంది. పిల్లర్లు కూడా నిర్మితమైన తర్వాత అలైన్ మెంట్ మార్పు ఏమిటని నిలదీస్తోంది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం , ఎల్ అండ్ టీ ల మద్య మెట్రో వార్ నడుస్తుంది. దీంతో మెట్రో రైలు వస్తుందా? లేక ఆగిపోతుందా? అనే సందేహం తెలంగాణ ప్రజలకు కలుగుతుంది.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more