ఇంతవరకు మనం రక్షణ శాఖకోసం ఆయుధాలను యుద్ధ సామగ్రిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ వస్తున్నాం. ఈ మధ్యనే గోవాలో నావికాదళ విన్యాసాలను చూసి ఆనందాశ్చర్యాలను వ్యక్తపరచిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ పరికరాలన్నిటినీ చూసిన తర్వాత వీటిని మనం ఇతర దేశాలనుంచి ఎందుకు కొనుక్కుంటున్నాం, మనమెందుకు ఉత్పత్తి చెయ్యటం లేదు అని అన్నారు.
ఆ తర్వాత అందుకు ముందడుగులు కూడా వెయ్యటం మొదలుపెట్టారు. విదేశీ పెట్టుబడులతో భారత్ లో డిఫెన్స్ ఇండస్ట్రీని నెలకొల్పటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయుధాలు, పరికరాలను దిగుమతి చేసుకోవటంలో ప్రపంచంలోనే పెద్ద దేశమైన భారత్ ని అతి పెద్ద ఉత్పాదన చేసే దేశంగా మార్చుదామనే ఆలోచన ఇంతవరకూ ఏ ప్రధాన మంత్రీ చెయ్యనది.
ఈ వార్త పాకటంతోనే విదేశీ పెట్టుబడిదారులంతా మోదీని కలవటానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న మోదీ చెప్పింది చేస్తారనే నమ్మకం ఉండటంతో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ నుంచి ఒకరి తర్వాత మరొకరుగా వచ్చే 10 రోజులలో మోదీతో సంప్రదింపులు జరుపబోతున్నారు. కొన్ని ఉత్పత్తుల మీద పూర్తిగా విదేశీయుల ఆధిపత్యం ఉండబోతోంది. దానితో ప్రపంచంలోని ఆగ్ర దేశాలు భారత్ లో పెట్టుబడి పెట్టటానికి ఉత్సుకతను చూపిస్తూ పోటీలు పడుతున్నాయి.
భారతదేశానికి యుద్ధ సామగ్రిని సరఫరా చేసినవారిలో అగ్రస్థానంలో ఉన్న రష్యా కూడా తమ దేశ ప్రతినిధిని మోదీతో సంప్రదింపులు జరపటానికి పంపుతోంది.
భారత దేశం గత సంవత్సరం డిఫన్స్ కోసం 36000 కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. అందువలన విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం కోసం ఇంతవరకు విదేశీ పెట్టుబడులకున్న 26 శాతం పరిమితిని పెంచుతూ భాజపా ప్రభుత్వం 49 శాతానికి పెంచే ప్రతిపాదనకు నాంది పలుకుతోంది. దీని మీద ఇంకా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంతిమ నిర్ణయాన్ని తీసుకోవటం మిగిలివుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more