భర్తతో సహా మరిది సాయంతో 17 మంది తనను రేప్ చేసారని, అందులో ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నాడని, అందువలన ప్రతిరోజూ తనకి ప్రాణభయం ఉందని ఆవేదన వెలిబుచ్చుతోంది 20 సంవత్సరాల మహిళ. కేంద్ర మంత్రి నిహాల్ చంద్ మేఘ్వాల్ మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ ప్రతిరోజూ వస్తున్న హెచ్చరికలు, బెదిరింపులు, మానసిక వేదన వలన తనిక ఊళ్ళో ఉండటం కూడా కష్టమే నంటూ చెప్తోంది. అందుకు కారణం తను కేసు పెట్టిన వాళ్ళల్లో పెద్ద పెద్దవాళ్ళు, సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారంటూ ఆమె ఆరోపిస్తోంది.
(పై ఫొటోలో ఢిల్లీలో భాజపా కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు)
బాధితురాలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, "నేనేం చెయ్యను ఎక్కడికిపోను. ఆరు నెలలపాటు నాకు మత్తు మందిస్తూ అంత మందితో అత్యాచారం చేయించారు. నిహాల్ చంద్ నా మీద రెండు సార్లు అత్యాచారం చెయ్యటం నాకు గుర్తుంది. మంత్రి మనుషులు ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చి నన్ను బెదిరిస్తున్నారు. క్షణక్షణం భయంతో జీవిస్తున్నాను. నా ఫిర్యాదులోంచి మంత్రి పేరును తొలగించమని వత్తిడి చేస్తున్నారు. కానీ నా జీవితంలో నాకు ఎదురైన అటువంటి ఘాతుకాన్ని నేను ఎలా మర్చిపోగలను? నా చెల్లెలు, తమ్ముడు, కుటుంబ సభ్యులను కూడా చంపుతామని బెదిరిస్తున్నారు" అన్న ఆమె, "ప్రధానమంత్ర మోదీ చాలా గొప్ప వ్యక్తి. నాకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నా" అంది.
2011 లో అప్పుడు 17 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు తన భర్త ప్రోద్బలంతో తన మీద జరిగిన అత్యాచారం మీద అప్పట్లో పెట్టిన కేసును 2012 లో రాజస్తాన్ పోలీసులు మూసివేయగా, కోర్టు కూడా కేసు కొట్టివేయగా దాన్ని మరోసారి తిరగదోడిన బాధితురాలు వేసిన పిటిషన్ మీద జిల్లా కోర్టు స్పందించి మేఘ్వాల్ తో పాటు మరో 17 మందికి నోటీసులు పంపించి ఆగస్ట్ 20 వరకు దాని మీద సమాధానం ఇవ్వమని కోరింది.
కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు నిహాల్ చంద్ ని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ఆందోళన చేస్తున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ కూడా దీని మీద ప్రధాన మంత్రికి రాయటానికి సిద్ధపడింది. ఇది చాలా అమానుషమని, ఒక మంత్రే ఇలాంటి చర్యకు పూనుకున్నా అతనికి కూడా సామాన్య వ్యక్తి కి పడే శిక్షే పడాలంటూ, ముందుగా ఆ మంత్రిని పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more