యుపిఏ ప్రభుత్వంలో నియమితులైన గవర్నర్ల రాజీనామాలను కోరిన ఎన్డియే ప్రభుత్వానికి మహారాష్ట్ర గవర్నర్ కె.శంకర నారాయణ సవాల్ విసిరారు. దమ్ముంటే రాజీనామా చెయ్యమని రాతపూర్వకంగా అడగండి అన్నారాయన.
హోం సెక్రటరీ అనిల్ గోస్వామి ఫోన్ చేసి తనను, ఇతర యుపిఏ నియమిత గవర్నర్లను రాజీనామా చెయ్యమని అడుగుతున్నారని శంకరనారాయణ మీడియా ప్రతినిధులతో అన్నారు. ఏ పదవీ శాశ్వతం కాదన్న విషయం తనకి తెలుసని, కానీ ఎన్డియే విధానమే తనకి నచ్చలేదని ఆయన అన్నారు.
గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనది గవర్నర్లు రాష్ట్రపతికి ప్రతినిధులు. నా రాజీనామా కోరే అధికారమున్నవాళ్ళు నన్నడిగే నేను ఆలోచిస్తా అంతే కానీ ఇతరులు ఆ విషయంలో నా మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం రాజ్యాంగవిరుద్ధం అన్నారు శంకరనారాయణ. తాను గోస్వామికి ఈ విషయంలో సమాధానం కూడా చెప్పలేదని అన్న శంకరనారాయణ, అంతకు ముందు ప్రభుత్వంలో నియమించబడ్డ గవర్నర్లను తొలగిపొమ్మని అనటమేమిటి ఇది చాలా ఆశ్చర్యజనకంగా ఉంది అని అన్నారు.
అయితే యుపిఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులనే గవర్నర్లుగా నియమించటం జరిగింది. అలాంటివాళ్ళు 19 మంది ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం కారణం లేకుండా వాళ్ళని తొలగించటం సాధ్యం కాదు కనుకనే వాళ్ళని రాజీనామా చెయ్యమని కోరటం జరుగుతోంది.
కొందరు గవర్నర్ల మీద ఉన్న కేసులు వాళ్ళు ఆ పదవినుంచి తొలగగానే వాళ్ళ మెడకి చుట్టుకునే అవకాశం కూడా ఉండటం కూడా గవర్నర్లు ప్రతిఘటించటానికి కారణమని భావిస్తున్నారు విశ్లేషకులు. అయితే 82 సంవత్సరాల శంకర నారాయణ కేవలం సిద్ధాంతపరంగా రాజీనామాకి అంగీకరించటం లేదని అన్నారు.
అయితే, యుపిఏ ప్రభుత్వం గవర్నర్లను నియమించినప్పుడు మీరెవరు మమ్మల్ని నియమించటానికి అని ఎవరూ అడగలేదు!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more