బ్యూరోక్రాట్లకు ప్రధాని మోదీ మార్గదర్శకాలిచ్చారు.
దుమ్ముపట్టిన ఫైళ్ళ దుమ్ము దులపండి. వరండాలలో పడున్న పనికిరాని వాటిని తీసివేయండి. అవసరమైతే వారానికి ఆరు రోజులు పనిచెయ్యవలసివస్తుంది.
దీనివలన ఐఏఎస్ ల నుంచి నిరసన వచ్చిందనుకుంటే అది పొరపాటే. వాళ్ళింకా ఆనందంగా ఉన్నారు ప్రధాని మాటలకు. అందుకు కారణం బ్యూరోక్రాట్స్ కి పనిలో స్వేచ్ఛకూడా ఇవ్వటం.
ఆఫీసుల్లో ఫైళ్ళు కదలకపోవటంతో పాటు ఆఫీస్ గోడల మీద పాన్ తిని ప్రేమగా వేసిన గుర్తులను కూడా లేకుండా కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని మోదీ కోరారు.
హెల్త్ మినిస్ట్రీ చేసిన ప్రకటన ప్రకారం కారిడార్లలో పడున్న 35 స్టీల్ అల్మైరాలు, 3 వాటర్ కూలర్లు, 40 కుర్చీలను తీసివేసారు.
ఆంక్షలతో పాటు ప్రధాని మోదీ బ్యూరోక్రాట్స్ ని సృజనాత్మకంగా ఆలోచించమని, పనిని మెరుగుపరచుకోమని, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన నిర్ణయాలను తీసుకోమని అన్నారు. అంటే పనిచెయ్యటానికి స్వేచ్ఛనిచ్చినట్లే కదా. అదే వారిని సంతోషపెడుతోంది. పూర్వ ప్రభుత్వ అవినీతి వలన ఆగిపోయివున్న కార్యకలాపాలను కదిలించిమని కూడా మోదీ చెప్పారు.
మోదీ వ్యవహార శైలికి, ఆ వేగానికి అందుకోవటానికి మంత్రుల సెక్రటరీలు, సివిల్ సర్వెంట్లు తలమునకలవుతున్నారు.
ఒక పక్క నరాలు తెగే వేగంతో పని చేస్తూనే, ఇతర సంబంధిత అధికారులను కూడా నడ్డి విరిగేట్టుగా పని చెయ్యవలసిన అవసరాన్ని కల్పిస్తూనే, వాళ్ళు ఆ పనిని ఆనందంగా చేసేట్టుగా చేస్తున్నారు.
దటీజ్ మోదీ!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more